వర్మ మరో రక్త చరిత్ర ప్లాన్ చేస్తున్నాడా...?
2017లో హత్యకు గురైన ఒక కర్నూలు జిల్లా నాయకుడు కి సంబంధించి ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉందని ఆ హత్య పరిణామాలను ఆయన సినిమా రూపంలో తెరకెక్కించే అవకాశం ఉందని ఆ దారుణ హత్యను ఆయన ప్రేక్షకులకు చూపించి అవకాశాలున్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకులతో మాట్లాడుతున్నారని ఆయన ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి కాస్త రాంగోపాల్ వర్మ కర్నూలు జిల్లాలో దాదాపు ఇరవై రోజుల పాటు ఉండే అవకాశం ఉందని కూడా సమాచారం.
ప్రస్తుతం ఆయన కొండా మురళి జీవిత కథను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తుండగా ఆ తర్వాత అనంతపురం జిల్లాలో ఓ గ్రామంలో జరిగిన సంఘటన ఆధారంగా సినిమాను నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కొండ మురళి జీవిత కథ సినిమాతో ఆయన బిజీగా ఉండగా ఈ సినిమా తర్వాత ఒక తెలుగు హీరో తో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉందని ఒక పెద్ద సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మరి రాంగోపాల్ వర్మ అనుకున్నది చేస్తారా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.