విదేశాల్లో ఆడిపాడుతున్న మహేష్ బాబు, కీర్తి సురేష్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా గీత గోవిందం  పేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట, ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ లకు జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమా పై ఉన్న అంచనాలు పెంచాయి. ఇదే ఎలా ఉంటే ఇప్పటి కే ఈ సినిమా షూటింగ్ 70 శాతం వరకు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఈ మధ్యే ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట చిత్ర బృందం కీర్తి సురేష్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను బయటకు వదిల గా దీనికి కూడా జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇ లా ఇప్పటికే జనాలలో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా కు సంబంధించి మహేష్ బాబు, కీర్తి సురేష్ కు మధ్య డ్యూయెట్స్ నుస్పెయిన్‌ లోని బార్సిలోనాలో ఈ ఇద్దరిపై షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫ స్ట్‌ షెడ్యూల్‌ దుబాయ్‌, సెకండ్‌ షెడ్యుల్‌ హైదరాబాద్‌‌లో పూర్తి చేసి ఇప్పుడు స్పెయిన్ లోని అందమైన లొకేషన్స్‌లో సాంగ్స్ షూట్ చేస్తున్నారు. అనంతరం అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ను దర్శకుడు పరశురామ్ చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని భారీ బడ్జెట్ కేటాయించి మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: