అల్లు అర్జున్ తో బాలయ్య వార్ ... ??

GVK Writings
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ తీస్తున్న సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కొన్నాళ్లుగా వేగవంతంగా కొనసాగుతుంది. దీనిని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ లెవెల్లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పుష్పరాజ్ అనే పాత్ర లో అల్లు అర్జున్ కనిపించనుండగా శ్రీవల్లి రోల్ లో రష్మిక మందన్న కనిపించనుంది.
ఈ మూవీ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ గా అంచనాలు ఉన్నాయి. ఇక మరొకవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా అఖండ కూడా భారీ స్థాయిలో రూపొందింది. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తుండగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాని మిరియాల రవీందర్ రెడ్డి, ద్వారా క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.
భారీ యాక్షన్ తో కలగలిపిన మాస్ మూవీ గా ఎంతో భారీ గా బోయపాటి తీస్తున్న ఈ సినిమాని డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవల రెండు రోజులుగా ఎంతో ఆలోచన చేసిన అఖండ యూనిట్, ఫైనల్ గా ఈ డేట్ ని లాక్ చేసిందని, త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన కూడా చేయనుందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే కేవలం మూడు రోజుల గ్యాప్ లో అటు నట సింహం, ఇటు స్టైలిష్ స్టార్ ల సినిమాల మధ్య భారీ బాక్సాఫీస్ పోరు ఖాయం అనే చెప్పాలి. ఈ పోరులో ఎవరు విజేతలుగా నిలుస్తారో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: