మనసంతా నువ్వే@20 యేళ్ళు.. ఎన్ని కోట్లు లాభమొ తెలుసా..?

Divya
అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమలోకి తారాజువ్వలా దూసుకొచ్చాడు యువహీరో ఉదయ్ కిరణ్. అంతే వేగంగా అతని ప్రాణాలు కూడా కోల్పోయాడు. ఈ హీరో మరణం వెనుక దాగి ఉన్న రహస్యాలు పక్కనపెడితే.. ఈయన నటించిన సినిమాలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను బాగా కట్టిపడేస్తున్నాయి అని చెప్పవచ్చు. ప్రేక్షకులు ఇష్టపడిన సినిమాల మనసంతా నువ్వే కూడా ఒకటి. ఇప్పుడు ఈ సినిమా విశేషాలను చూద్దాం.
ఈ మూవీలో ఉదయ్ కిరణ్ సరసన రీమాసేన్ నటించింది. ఈ సినిమా2001వ సంవత్సరంలో అక్టోబర్ 19న విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. నేటితో ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఇక ఈ సినిమా నిర్మాత ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. హీరో ఉదయ్ కిరణ్ ని చాలా మిస్ అవుతున్నానంటూ భావోద్వేగానికి  గురి అయ్యాడు.
మనసంతా నువ్వే సినిమా కి ముందు ఒక సినిమాను తీసి అప్పుల్లో ఉండగా ఈ సినిమా తనను బయటకు వేసిందని చెప్పుకొస్తున్నాడు. ఈ సినిమా కోసం అప్పట్లో 1.3 కోట్లు ఖర్చు చేశానని.. కానీ ఈ సినిమా నాకు దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల వరకు లాభాన్ని తెచ్చిపెట్టిందని నిర్మాత ఎమ్మెస్ రాజు తెలియజేశాడు. ఈ సినిమా షూటింగ్ నిర్మాత రాజు పుట్టినరోజు సందర్భంగా మే 10వ తేదీన ఆ రోజుల్లో నే స్టార్ట్ చేశారు.
అలా మొదలు పెట్టిన సినిమా ఎన్నో మలుపులతో, ఈ సినిమా చిత్రీకరించడం జరిగిందట. ఈ సినిమా షూటింగ్ లో హైదరాబాదులో మొదలు పెట్టడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే.. ఈ సినిమా బిజినెస్ ఆఫర్లు చాలానే వచ్చాయి. కానీ ఈ సినిమాని స్వతహాగా నిర్మాతలు విడుదల చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నిర్మాత రాజు ధన్యవాదాలు తెలిపాడు. ఇక ఈ మూవీతోనే సునీల్ కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: