విష్ణు, పవన్.. ఇద్దరూ ఎంతసేపు మాట్లాడుకున్నారో..!!

Deekshitha Reddy
హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీ నుంచి 'మా' అధ్యక్ష హోదాలో మంచు విష్ణు కూడా హాజరయ్యారు. పక్కపక్కనే కుర్చీలు వేసుకొని కూర్చున్నారు కూడా.. అయితే ఈ కార్యక్రమం జరిగినంత సేపు పవన్, విష్ణు ఒకరికొకరు ఎదురుపడినా.. ఆఖరికి పక్కనే కూర్చున్నా కనీసం పలకరించుకోలేదు. మంచు విష్ణు, ఓ దశలో పవన్ తో మాట్లాడాలని ప్రయత్నించినా.. పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకో ముభావంగానే ఉండిపోయారు. మొమెంటో తీసుకున్న అనంతరం విష్ణు ఎదురుపడినప్పటికీ పక్కనుంచి వెళ్ళిపోయాడు పవన్. దీంతో ఎందుకొచ్చిన తంటా అనుకున్నాడో ఏమో గానీ విష్ణు కూడా సైలెంట్ అయిపోయారు.
ఇదంతా నిన్న జరిగిన విషయం.. అందరూ టీవీల్లో చూసిన విషయమే కూడా.. వీరిద్దరూ ఇలా ఎడముఖం పెడముఖంలా ఉన్నారని అన్ని టీవీ ఛానల్స్ లో కూడా ప్రసారమైంది. సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కరలేదు. మంచు విష్ణుపై భీభత్సమైన ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే తాజాగా ఈ మొత్తం ఎపిసోడ్ పై మంచు లక్ష్మి స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆమె.. ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. మంచు విష్ణు, పవన్ కళ్యాణ్ చాలా సేపు మాట్లాడుకున్నారంటూ చెప్పుకొచ్చారు లక్ష్మి. మేమంతా ఒక్కటేనని.. అసలు ఏ గొడవా లేదంటూ కవర్ చేశారు.
పవన్ కళ్యాణ్.. విష్ణు కలిసి ఉండే ఒక ఫోటోను పట్టుకొని.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారని.. స్టోరీలు కూడా పెట్టారని చెప్పుకొచ్చారు లక్ష్మి.  మాలో మాకు ఎవరికీ విభేదాలు లేవని.. అందరం ఒక కుటుంబమని పాత పాట పాడుతూ కవర్ చేసుకున్నారు. మరి విష్ణు, పవన్ మాట్లాడుకుంటే కనీసం ఒక్క ఫొటో కూడా ఎందుకు బయటకు రాలేదో మంచు లక్ష్మి చెబితే బాగుండేది. పోనీ ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. మరో విషయం చెప్పడంతో మీడియాకు కూడా మాట పడిపోయింది. మంచు విష్ణు గెలుపు కోసం ఆంధ్ర, తెలంగాణ ప్రజలు మొత్తం ఓటు వేశారని చెప్పడంతో.. బిత్తరపోవడం అక్కడి మీడియా ప్రతినిధుల వంతయింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇంకెన్ని మీమ్స్ వస్తాయో ఈరోజు, రేపు వెయిట్ చేస్తే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: