కళా 'మా' తల్లి : మా లో ఆ సత్తా ఆయనకే ఉంది ..శ్రీ రెడ్డి !!
పవన్ కళ్యాణ్ , చిరంజీవి , నాగబాబు వేసిన ఎత్తులు ఈ సారి పారలేదని, ఇకపోతే ఏళ్ళ తరబడి కొనసాగుతున్న వారి ఆధిపత్యం పోయినందుకు ప్రస్తుతం ఏడుస్తున్నారు అంటూ కామెంట్స్ చేసింది. ఒకప్పుడు నేను మా పరువు తీసాను అంటూ హేమ , నాగబాబు , జీవిత ఇలా అందరూ నన్ను అవమానించి ఏడిపించారు ఇప్పుడు ఆ పెద్దలే మా పరువుని రోడ్డుపైకి తెచ్చి గంగ పలు చేస్తున్నారు అంటూ విమర్శలు చేసింది . అస్సోసియేషన్ లో ఇప్పుడు విష్ణు- ప్రకాష్ రాజ్ ప్యానల్ గొడవ కాస్త కమ్మ -కాపు గొడవగా మారిందని కుండ బద్దలు కొట్టింది. దాసరి నారాయణ రావు తరవాత అంతటి గొప్ప నాయకత్వ లక్షణాలున్న మోహన్ బాబు గారు మాత్రమే ఆ స్థానాన్ని భర్తీ చేయగలరని శ్రీరెడ్డి చెప్పింది . దింతో మోహన్ బాబు ని ఇప్పటి నుండే కాకాపడుతోందని నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. మరి ప్రకాష్ రాజ్ ప్యానల్ ఈ విషయమై ఎలా స్పందిస్తారో చూడాలి మరి