పూజకు బాలీవుడ్ ఆఫర్ ఎలా వచ్చిందో తెలుసా ?

Vimalatha
పూజా హెగ్డే ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆమె 13 అక్టోబర్ 1990 న ముంబైలో జన్మించింది. కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ వంటి వివిధ రకాల పనులు చేసింది. పూజా హెగ్డే మిస్ యూనివర్స్ ఇండియా 2010 లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. పూజాకు బాలీవుడ్ లో మొదటి చిత్రం 'మొహంజొదారో'. హృతిక్ రోషన్ సరసన నటించి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అయితే పూజకు ఈ పాత్ర ఎలా వచ్చిందో మీకు తెలుసా? 'మొహెంజోదారో'లో పూజా హెగ్డే నటించడం వెనుక ఒక ప్రత్యేక కథ ఉంది. వాస్తవానికి దీని కోసం ఆమె యాడ్ ఆధారంగా ఎంపిక చేయబడింది.
పూజను హృతిక్ రోషన్, అశుతోష్ గోవారికర్ ఎంపిక చేయలేదు. డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ భార్య వల్ల ఆమెకు ఈ ఆఫర్ వచ్చింది.   అశుతోష్ భార్య రణ్‌బీర్ కపూర్‌తో కలిసి యాడ్‌లో పూజను చూసింది. ఆ తర్వాత నెక్స్ట్ చిత్రంలో పూజ నటించాలని ఆమె తన భర్తకు సలహా ఇచ్చింది. ఈ చిత్రం ఘోరంగా ఫ్లాప్ అయింది. 2016 లో విడుదలైన 'మొహంజోదారో' చిత్రం అశుతోష్ గోవారికర్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటి. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు. ఈ చిత్రం ఘోర పరాజయంతో పూజకు హిందీలో అవకాశాలు కరువయ్యాయి. ఆ తరువాత టాలీవుడ్ లో ఆమెను అదృష్టం వరించింది. దాదాపు 3 సంవత్సరాల తరువాత పూజా హెగ్డే సాజిద్ నడియాద్వాలా 'హౌస్‌ఫుల్-4' చిత్రంతో బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది.
పూజా తదుపరి చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కింది. అక్కినేని అఖిల్ సరసన పూజా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' దసరా కానుకగా విడుదల కానుంది. సూపర్ స్టార్ ప్రభాస్ తో ఆమె చేసిన 'రాధేశ్యామ్' సంక్రాంతికి విడుదల కానుంది. దీనితో పాటు ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఆమె రాబోయే చిత్రం 'కభీ ఈద్ కభీ దీపావళి' లో సల్మాన్ ఖాన్‌తో కూడా ఆమె కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: