అమ్మవారికి మందు తాగించిన వర్మ.. ఫోటో వైరల్?
ఇక సినిమాలు తెరకెక్కించడమే కాదు సోషల్ మీడియాలో వరుసగా షాకింగ్ పోస్టులు పెట్టి ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు. ఇలా ఎప్పుడూ సెన్సేషన్ సృష్టించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరో సంచలన సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. కొండా దంపతుల లవ్ స్టోరీ తెరకెక్కించేందుకు సిద్ధమని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇక ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం కూడా జరిగింది. తెలంగాణ రక్త చరిత్ర గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నా అంటూ ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు.
అయితే రాంగోపాల్ వర్మ తెరకెక్కించబోతున్న కొండ సినిమా షూటింగ్ ఇటీవలే వరంగల్ జిల్లాలో వంచనగిరి లో ప్రారంభమయింది ఇక ఈ క్రమంలోనే గండిమైసమ్మ ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజలు చేశారు రాంగోపాల్ వర్మ. సాధారణంగా వర్మ దేవుళ్లను అస్సలు నమ్మరు. కానీ చిత్ర బృందం కోసం కేవలం ప్రారంభోత్సవాలు సమయంలో మాత్రం పూజలు చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల రాంగోపాల్ వర్మ గండిమైసమ్మ ఆలయంలో పూజలు చేసి అమ్మవారికి మందు తాగించాడు. అక్కడి సాంప్రదాయాల ప్రకారం అమ్మవారికి మందు తాగించి ఆశీస్సులు పొందుతూ ఉంటారు భక్తులు. వర్మ కూడా అమ్మవారికి మందు తాగించి అమ్మవారి దీవెనలు పొందాడు.