అక్కడికి వెళితే అక్కడే ఉండిపోవాలని అనిపిస్తోంది...సాయి పల్లవి..!

Pulgam Srinivas
భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో థియేటర్లలో విడుదల అవుతున్న భారీ క్రేజ్ ఉన్న సినిమా 'లవ్ స్టోరీ'. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో చిత్రబృందం పలు టీవీ చానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా హీరోయిన్ సాయి పల్లవి కూడా వివిధ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో సాయిపల్లవి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఈ క్రమంలో సాయి పల్లవి కొన్ని విషయాల మీద స్పందిస్తూ.. దర్శకుడు శేఖర్ కమ్ముల ఎంత సాధారణంగా ఉంటాడో, కనిపిస్తాడో మనందరికీ తెలిసిందే.

ఈ విషయం గురించి చెబుతూ శేఖర్ కమ్ముల తో పనిచేయడం వల్ల తనలో వచ్చిన మార్పుల గురించి హీరోయిన్ సాయి పల్లవి తెలిపింది. తాను ఇంతకు ముందు కంటే చాలా సున్నితంగా మారిపోయాను అని చెప్పుకొచ్చింది. అలాగే 'లవ్ స్టోరీ' సినిమా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతూ.. 'లవ్ స్టోరీ' సినిమా ఎక్కువగా రూరల్ ఏరియా లో జరిగింది. ఎక్కువగా అవుట్ డోర్ చేయవలసి వచ్చింది. దీని గురించి సాయి పల్లవి మాట్లాడుతూ.. తాను తెలుగు అమ్మాయిని అని ఫీల్ అవుతాను అని తెలిపింది. 'ఫిదా' సినిమా కోసం బాన్సువాడ, ఇప్పుడు 'లవ్ స్టోరీ' సినిమా కోసం పిప్రీలో చేశామని తెలిపింది. అక్కడి జనాలు హీరో హీరోయిన్లు అనే తేడా లేకుండా మాతో మాట్లాడారు అని తెలిపింది. బాన్సువాడలో ఓ స్థానిక డిజైనర్‌ చీరను కూడా గిఫ్ట్ ఇచ్చినట్లు తెలిసింది. గ్రామాలకు వెళితే అక్కడే ఉండిపోవాలని అనిపిస్తోంది అని అక్కడి ప్రజలు అంత ప్రేమగా ఉంటారు అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: