కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తూ తనలో ఉన్న వైవిధ్యమైన నటుడిని జనాలకు పరిచయం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. ఎక్కువగా కోలీవుడ్ సినిమాలో నటించిన ధనుష్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలలో నటించిన ధనుష్ టాలీవుడ్ సినిమాలో మాత్రం నేరుగా నటించలేదు. కానీ త్వరలోనే తెలుగులో ఒక సినిమాలో ధనుష్ నటించబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిమాస్ బ్యానర్పై రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకి నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈమధ్య ధనుష్ తన సినిమా కోసం హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో ఈ నిర్మాతలు, దర్శకుడు శేఖర్ కమ్ముల కలిసారు.
ప్రస్తుతం ధనుష్ హాలీవుడ్ లో అత్రాంగి రే , ది గ్రే మ్యాన్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో హల్చల్ గా మారింది. ప్రస్తుతం దక్షిణాదిన అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో తెలుగువారు ముందుంటారు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఒక్క సినిమాకు వంద కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మిగతా హీరోలు కూడా దాదాపు యాభై కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ధనుష్ తన తొలి తెలుగు సినిమాకు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి ధనుష్ తన తొలి తెలుగు సినిమాతో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.