షాలిని పాండేకు బాలీవుడ్ ఆఫర్ ఎలా వచ్చిందంటే ?

Vimalatha
అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ సరసన నటించిన షాలిని పాండే మంచి పేరు తెచ్చుకుంది. ఇటు తెలుగు లో మొదటి సినిమాతోనే సత్తా చాటిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమె షాలిని పాండే రణ్‌వీర్ సింగ్ సరసన "జయేశ్‌భాయ్ జోర్దార్‌"తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతోంది. యష్ రాజ్ ప్రొడక్షన్స్ చిత్రంలో ఆమె ఆ పాత్రను ఎలా పొందింది అనే వివరాలను ఓ ఇంటర్వ్యూ లో పంచుకుంది.
"చుట్టూ గమనించడం అనే నా లక్షణం నిజంగా అదృష్టం. నేను నా స్నేహితుడితో ఒక రోజు రెస్టారెంట్‌లో ఉన్నాను. అక్కడ షానూ (షానూ శర్మ, YRF కాస్టింగ్ డైరెక్టర్) కొంతమంది వ్యక్తులతో కూర్చున్నారు. షానూ పక్కనే ఉన్న ఇద్దరికి ఒకే ఒక స్థలం అందుబాటులో ఉంది!  అది చూసి మేము కొంచెం వింతగా భావించాము ఎందుకంటే వాళ్ళు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తున్నట్లు అనిపించింది. అందుకే మేము వేరే టేబుల్ వద్ద కూర్చుని భోజనం చేసాము. మేము అస్సలు మాట్లాడుకోలేదు.
కొన్ని రోజుల తరువాత నేను మరొక బిస్ట్రో కి వెళ్ళాను. ఆమెను మళ్ళీ అక్కడ చూశాను. మళ్ళీ, నేను ఆమె పక్కన కూర్చోవలసి వచ్చింది. ఎందుకంటే అక్కడ అసలు ఎలాంటి టేబుల్ అందుబాటు లో లేదు. ఆ టైం లో కూడా మళ్లీ మేము ఇంటరాక్ట్ అవ్వలేదు ! ఒక రోజు నేను నా ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తున్నాను. అందులో ఆమె మెసేజ్ ఉంది. ఉత్సాహంగా సందేశాన్ని తెరవడానికి ప్రయత్నించాను. కానీ అది పొరపాటున డిలీట్ అయ్యింది. అదృష్టం కొద్దీ వారు నన్ను సినిమా కోసం ఆడిషన్ చేయాలనుకుంటున్నారని ఆమె బృందం నుండి నాకు కాల్ వచ్చింది ! " అంటూ బాలీవుడ్ ఆఫర్ వెనుక ఉన్న కథను వెల్లడించింది షాలిని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: