ఆయన కోసమే ఇదంతా...శృతి హాసన్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ ఈ సంవత్సరం మంచి జోరు మీద ఉంది అని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సంవత్సరం సంక్రాంతికి మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన 'క్రాక్' సినిమాతో ముద్దుగుమ్మ శృతిహాసన్ బాక్సాఫీసు వద్ద మంచి హిట్ ను అందుకుంది. ఆ తర్వాత కొద్ది కాలంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వకీల్ సాబ్' సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ ని సొంతం చేసుకోంది. ఇలా ఒకే సంవత్సరం రెండు బ్లాక్ బస్టర్ హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న శృతి హాసన్ ప్రస్తుతం కూడా జనాల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం శృతి హాసన్ నటిస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ లలో  ఒకటి 'సలార్'. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సలార్' సినిమాలో శృతి హాసన్ ఒక జర్నలిస్టు గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాతో పాటు శ్రుతిహాసన్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. గోపిచంద్ మలినేని త్వరలోనే నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా విషయం మనందరికీ తెలిసిందే. 'ఎన్‌బీకే107' అనే వర్కింగ్ టైటిల్‌ తో ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. ఈ చిత్రంలో వేరే హీరోలను తీసుకుందామని చిత్రబృందం అనుకున్నప్పటికీ , గోపీచంద్ మలినేని మాత్రం శృతిహాసన్ కే ప్రాధాన్యత ఇచ్చి ఆమెను ఓకే చేశారట. ఈ కథను ఇప్పటికే గోపీచంద్, శ్రుతిహాసన్ కు వినిపించగా ఆ కథకు శృతిహాసన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శృతి హాసన్ పాత్ర కూడా తనకు ఎంతో నచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శృతిహాసన్ ఒక సాధారణ గృహిణి పాత్రలో కనిపించబోతున్నారు అని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం శృతిహాసన్ బరువు పెరగాలని నిర్ణయించుకుందట. ఇలా శృతిహాసన్, బాలకృష్ణ సినిమా కోసం బరువు పెరగడానికి నిర్ణయించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: