సోషల్ మీడియాలో రష్మిక జోరు

GVK Writings
యంగ్ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు తో పాటు కన్నడ, తమిళ్, హిందీ వంటి పలు భాషల్లో హీరోయిన్ గా వరుస ఛాన్స్ లతో కొనసాగుతున్నారు. నాగ శౌర్య తో చలో సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక, ఆ తరువాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీతా గోవిందం సినిమా ద్వారా బిగ్ సక్సెస్ అందుకున్నారు.
అనంతరం ఏకంగా మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన రష్మిక ఆపైన నితిన్ భీష్మ ద్వారా మరొక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు రష్మిక. వాటిలో అల్లు అర్జున్ తో ఆమె చేస్తున్న పుష్ప మూవీ పై అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే మొదటి నుండి కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో తన సినిమాలు, అలానే ఫ్యామిలీ విషయాలు కూడా పంచుకునే అలవాటు గల రష్మిక మందన్న, నిన్న తనకు సైమా లో అవార్డులు దక్కడంతో ఆనందం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే రష్మిక సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కి మధ్యలో సరదాగా కొందరికి రిప్లై ఇస్తూ ఉండడం వంటివి చేస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతూ ఉంటారు.
అలానే తన లేటెస్ట్ ఫోటో షూట్స్ కి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే రష్మిక, తనకు టైం పాస్ సోషల్ మీడియా మాధ్యమాలు అని చెప్తుంటారు. ఇక తనకు తీరిక సమయంలో ఫ్రెండ్స్ తో చాట్ చేస్తుంటాను అని చెప్పే రష్మిక, చేతిలో ఫోన్ లేకపోతే కష్టం అంటారు. ఆ విధంగా ప్రస్తుతం హీరోయిన్ గా ఒక్కో సినిమాతో అంతకంతకూ క్రేజ్ పెంచుకుంటూ కొనసాగుతున రష్మిక మందన్న రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో విజయాలు అందుకుంటారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: