నితిన్ ఆ జోనర్ మూవీస్ ను పక్కన పెట్టినట్టేనా..!

Pulgam Srinivas
తెలుగు యంగ్ హీరోలలో నితిన్ ఒక్కడు. నితిన్ మాస్ సినిమాలతో కంటే ఎక్కువగా లవ్ సినిమాలతోనే తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తేజ దర్శకత్వంలో సదా హీరోయిన్ గా తెరకెక్కిన 'జయం' సినిమాతో నితిన్ వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే నితిన్ తెలుగు ఇండస్ట్రీ లో ఒక మంచి లవర్ బాయ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నితిన్ ఎన్నో సంవత్సరాల పాటు పరాజయాల్లో కూరుకుపోయిన సమయంలో కూడా 'ఇష్క్' వంటి ప్రేమకథతోనే మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాతో మరోసారి ఆ ఫామ్ ను కంటిన్యూ చేశాడు. ఇలా ప్రేమ కథలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నితిన్ ఇక పై మాత్రం ప్రేమ కథ చిత్రాల్లో కనిపించే లో అవకాశాలు లేనట్లే కనిపిస్తుంది.

నితిన్ కూడా ఆ మధ్య ఒకసారి స్టేజీ పై ఇకపై లవ్ స్టోరీ సినిమాలు  చేయను అని చెప్పాడు .ప్రస్తుతం నితిన్ చేస్తున్న , చేయబోతున్న సినిమాలు చూస్తుంటే నితిన్ మాట మీద నిలబడి నట్టే కనిపిస్తుంది. ప్రస్తుతం నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అధికారిక లాంచింగ్ కూడా ఈ మధ్యనే పూర్తి అయ్యింది. ఈ సినిమాలో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమా పేరు వింటేనే మనకు అర్థమవుతుంది, ఇదేదో పొలిటికల్ డ్రామా సినిమా అని, దీని తర్వాత నితిన్ , వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు. ఇది కూడా యాక్షన్ సినిమా అని వార్తలు వస్తున్నాయి. నితిన్ ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టి ఉంచిన 'పవర్ పేట' సినిమా కూడా ఒక మంచి యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది ఇలా నితిన్ వరుస మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: