లారెన్స్ అందుకే 'చంద్రముఖి టు' సినిమాను స్టార్ట్ చేయడం లేదా..!

Pulgam Srinivas
బ్లాక్ బాస్టర్ మూవీ 'చంద్రముఖి' సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది అంటూ కోలీవుడ్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. ఈ వార్తలు అటు తిరిగి ఇటు తిరిగి టాలీవుడ్ వరకు చేరిపోయాయి. ఈ వార్త టాలీవుడ్ జనాలకు కూడా ఆసక్తిని కలగజేసింది. ఎందుకంటే 'చంద్రముఖి' సినిమా కోలీవుడ్ లో ఎంత విజయం సాధించిందో  టాలీవుడ్  లోనూ అంతే మంచి విజయాన్ని  సాధించింది. ఈ సినిమా హర్రర్ కామెడీ జోనర్ లో వచ్చే సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో రజనీకాంత్ .. ప్రభు .. నయనతార .. జ్యోతిక ప్రధానమైన పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే.  దెయ్యం .. ఆవహించడం వంటి అంశాలు ఉన్నప్పటికీ ఆ సన్నివేశాలను చూపించిన విధానం ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది.

ఆ ఆవహించిన ఆత్మను తరిమివేయడానికి ఒక వైపు నుంచి డాక్టర్ ... మరో వైపు నుంచి మాంత్రికుడు ప్రయత్నాలు చేసే తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమా విజయానికి విద్యాసాగర్ ఇచ్చిన సంగీతం కూడా ప్రముఖ పాత్ర వహించింది అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ప్రయత్నాలు చాలా రోజుల నుండి జరుగుతున్నప్పటికీ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తి చూపక పోవడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. దానితో దర్శకుడు పి.వాసు ఈ సినిమాను రాఘవ లారెన్స్ తో తీయాలని డిసైడ్ అయ్యాడు. హర్రర్ కామెడీ జోనర్ సినిమాలలో నటించడం లారెన్స్ కు పెద్ద కొత్తేమీ కాకపోవడం, అలాగే పి.వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా నటించిన 'శివలింగ' సినిమా మంచి విజయం సాధించడంతో,  'చంద్రముఖి 2' సినిమాను  సెట్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథా చర్చలు జరిగినప్పటికీ ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. దానికి ప్రధాన కారణం లారెన్స్ అని వార్తలు వస్తున్నాయి. 'చంద్రముఖి' సినిమా కు జనాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాను ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ మొదలు పెట్టి పూర్తి చేసినట్లయితే సినిమా నిర్మాతలు దీనిని ఎక్కడ 'ఓటిటి' కి అమ్మి వేస్తారో అని భయంతో రాఘవ లారెన్స్ ఈ సినిమా మొదలు పెట్టడం లేదు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: