పెరిగిపోతున్న నివేత సోషల్ మీడియా క్రేజ్ !!

NIKHIL VINAY
నాని జెంటిల్ మాన్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ నివేత తమోస్ యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆమె నటించిన బ్రోచేవారుఎవరురా , 118 , నిన్ను కోరి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ మధ్య హీరోయిన్ గా కొంచెం ఛాన్సులు తగ్గినప్పటికీ నివేత ఎలాంటి పాత్రలు అయిన చేయడానికి రెడీ గా ఉంది. దర్బార్ సినిమాలో రజినీకాంత్ కి కూతురు గా నటించి మెప్పించింది.అలాగే ఈ మద్యనే వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి నివేత మంచి పేరు కొట్టేసింది. 

ఆమెకి వెండితెర మీదనే కాదు సోషల్ మీడియా లో కూడా మంచి క్రేజ్ ఉంది. నివేత తన తమ్ముడు నిఖిల్ థామస్ తో కలిసి ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంది. ఎక్కువగా నివేత ఇంస్టాగ్రామ్ లోనే ఎక్కువగా యక్టీవ్ గా ఉంటుంది. రోజు అందులో ఆమె ఫొటోస్ ని మరియు తన ఫామిలీ ఫోటోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది.నివేత ని ఇంస్టా లో 53 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అలాగే ఆమె సోషల్ మీడియా లో బ్రాండింగ్ తో కూడా లక్షలు గడిస్తుంది. ఇక ప్రస్తుతం నివేత సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుంది. ఇందులో రెజినా కాసాండ్రా కూడా నటిస్తుంది. 


ఈ సినిమా వచ్చే ఏడాది లో విడుదల కాబోతుంది. ఇదే కాకుండా నివేత మీట్ క్యూట్ అనే సినిమాలో కూడా నటిస్తుంది. ఆమె సోషల్ మీడియా లో పెద్దగా లైవ్ లు పెట్టకపోయిన తన జీవితంలో జరిగే ప్రముఖ సంఘటనలని కచ్చితంగా అప్లోడ్ చేస్తుంది. ఈ ఫొటోస్ ఆమె క్యూట్ నెస్ కి ఎవరేనా ఆమె అభిమానులు అవ్వాల్సిందే. నివేత తన తమ్ముడు తో చేసే రీల్స్ కూడా చాలా ఫన్నీ గా ఉంటాయి వీటికి లక్షల్లో వ్యూస్ రావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: