అభిమానులకు చేరువలో నమ్రతా శిరోద్కర్..!

Divya
సినీ ఇండస్ట్రీలో చాలామంది తమ తమ సినిమాలతో, పనులతో బిజీగా ఉన్నప్పటికీ కొంతమంది ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. ముఖ్యంగా మన స్టార్ హీరోల భార్యలు అయితే ఇటీవల ఎక్కువగా ప్రేక్షకులకు మరీ చేరువలో ఉంటున్నారు. ఇలాంటివారిలో ఉపాసన, స్నేహ రెడ్డి, నమ్రతా శిరోద్కర్ లాంటి ఎంతో మంది స్టార్ హీరోల భార్యలు తమ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు పంచుకోవాలని, తెగ ఆరాట పడుతుంటారు.. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య అలాగే ప్రముఖ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ కూడా తన కుటుంబంలో జరిగే ఏ విషయాన్ని అయినా సరే ప్రేక్షకులతో పంచుకోవడానికి ఆమె ఏమాత్రం వెనుకడుగు వేయరు అని చెప్పవచ్చు..
కరోనా కారణంగా లాక్‌డౌన్‌ పెట్టడంతో ఆ సమయంలో తన కుటుంబం లో జరిగిన ప్రతి విషయాన్ని కూడా , ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది. ఇక నమ్రత జీవిత విషయానికి వస్తే, మాజీ మిస్ ఇండియా, ప్రముఖ నటి అలాగే బాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అయితే మహేష్ బాబు భార్యగా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. మహారాష్ట్ర లో జన్మించిన నమ్రత, వారి పూర్వీకులు మాత్రం గోవాకు చెందిన వారు. ఇక నమ్రత అమ్మమ్మ ప్రముఖ మరాఠీ హీరోయిన్ గా  గుర్తింపు పొందిన మీనాక్షి శిరోద్కర్. ఇక ఈమె అక్క  శిల్పా శిరోద్కర్ కూడా ఒక హీరోయిన్ అని తెలిసిన విషయమే. మొదట మోడల్ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె 1993లో మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది.
ఇక మిస్ ఇండియా అయిన తర్వాత బాలీవుడ్ లో  అవకాశాలు ఈమెకు ఎక్కువగా వచ్చాయి.. ఆ తర్వాత తెలుగులో వంశీ చిత్రంలో మహేష్ బాబు, నమ్రత కలిసి నటించి అక్కడి ప్రేమించుకొని ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక తెలుగులో రెండు చిత్రాలలో నటించిన, కన్నడ ,మలయాళంలో కూడా ఒక సినిమాలో నటించింది. ఇక తనకు ముందు నుంచి అభిమానులు ఉండటం కారణంచేత తన కుటుంబంలో జరిగే ప్రతి విషయాలను  సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: