పూరీ.. కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా..!!

P.Nishanth Kumar
ఇటీవలే పూరి జగన్నాథ్ ఓ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు పూరి జగన్నాథ్ మళ్లీ తన పూర్వ వైభవం తెచ్చుకున్నట్లు కనిపించాడు. ప్రస్తుతం తన పూర్వ వైభవాన్ని కంటిన్యూ చేసే విధంగా ఆయన తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ లైగర్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకోగా ప్రస్తుతం చివరి షెడ్యూల్ ను గోవాలో చేస్తుంది చిత్రబృందం. ఇటీవలే షూటింగ్ కు సంబంధించిన ఓ పిక్ ను విడుదల చేయగా విజయ్ దేవరకొండ అభిమానులు భారీగా ఈ లుక్కు ను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసి సినిమాపై క్రేజ్ మరింత పెంచేలా చేసుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూండగా బాలీవుడ్ లో కూడా ఈ చిత్రంపై ప్రేక్షకులు ఎంతగానో అంచనాలు పెట్టుకున్నారు. 

అయితే ఈ సినిమా గురించి గతంలో విజయ్ దేవరకొండ కామెంట్ చేయడం అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. ఓ మెమ్ లో ఈ సినిమా వందకోట్ల ఢీల్ అయిందని సోషల్ మీడియా లో రాగా దానికి విజయ్ దేవరకొండ అంతకు మించిన కలెక్షన్లు థియేటర్ లలో వసూలు చేయగలను అని నమ్మకాన్ని వ్యక్తపరచి అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచాడు. ఈ నేపథ్యంలో తాజాగా పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాపై గట్టి నమ్మకం చూపించాడు. ఈ చిత్రంతో తప్పకుండా మంచి విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు కూడా సాధించగలను అని చెప్పి పూరిజగన్నాథ్ తన కాన్ఫిడెన్స్ ను సినిమాపై చెప్పగలిగాడు. కరణ్ జోహార్ తో కలిసి చార్మి పూరి జగన్నాథ్ తో కలిసి ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రం నుంచి త్వరలోనే పాటల్ని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: