చిరు తో చిందులేయించిన సాయి పల్లవి!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎన్నో అంచనాల తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం లవ్ స్టోరీ. అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాదులో ఎంతో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాధా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా గెస్ట్ గా వచ్చి ఆయన ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

కరోనా రెండో దశ తర్వాత ఏ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించని నేపథ్యంలో ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది అని మొదటి నుంచి అందరూ నమ్ముతు ఉండగా ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి అని సినిమా విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆ విధంగా ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఫీల్ గుడ్ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తులైన శేఖర్ కమ్ముల ఈ చిత్రం ను కూడా ప్రేక్షకుల ఫీల్ నీ తగ్గించలేని విధంగా తెరకేక్కించాడట. 

ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి స్టేజిపై సాయి పల్లవి తో కలిసి స్టెప్పేయడం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. మొదటగా ఈ సినిమాలో వచ్చిన సారంగదరియా పాట సాయి పల్లవి ఆ తర్వాత చిరంజీవి అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటకు చిరు తో కలిసి డాన్స్ చేసింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే పవన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి సెప్టెంబర్ 24వ తేదీన విడుదల అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: