బాలయ్య మిస్ అయింది ... మోక్షజ్ఞతో తీరనుందట ... ??
ఇక దీని అనంతరం గోపీచంద్ మలినేని తో నెక్స్ట్ మూవీ చేయనున్నారు బాలయ్య. మైత్రి మూవీ మేకర్ వారు నిర్మించనున్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. అయితే అసలు విషయం ఏమిటంటే, బాలయ్య త్వరలో సొంతంగా దర్శకత్వం వహిస్తూ తన తనయుడు మోక్షజ్ఞతేజ ని మూవీ ఇండస్ట్రీ కి లాంచ్ చేస్తూ తీయనున్న సినిమా ఆదిత్య 999 మ్యాక్స్. ఈ మూవీపై బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం బాలయ్య హీరోగా తెరకెక్కిన టైం ట్రావెల్ మూవీ ఆదిత్య 369 మూవీ కి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందనుంది. కాగా ఈ సినిమాలో మోక్షజ్ఞ హీరోగా నటించనుండగా బాలయ్య ఒక కీలక పాత్ర చేయనున్నారు.
అయితే ఈ సినిమాలో మోక్షజ్ఞకు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనుందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతున్న న్యూస్. సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా ఎంతో మంచి ప్రాధ్యానత ఉండడంతో బాలయ్య ఆమెనే హీరోయిన్ గా తీసుకోనున్నారని, అలానే బాలయ్య తన సినీ కెరీర్ లో ఒక్కసారి కూడా శ్రీదేవితో సినిమా చేయకపోవడంతో ఆమె కూతురుతో తన కుమారుడు సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఆయన మదిలో ఉందని అంటున్నారు. ఎంతో భారీ వ్యయంతో రూపొందనున్న ఈ సినిమా ఫుల్ డీటెయిల్స్ వచ్చే ఏడాది రానున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు ఆగాల్సిందే.