రజినీకాంత్ మూవీ సీక్వెల్ లో నటించనున్న ప్రభాస్ ... ఏంటి నిజమే .. ??

GVK Writings
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శంకర్ తీసిన భారీ విజువల్ వండర్ మూవీ రోబో. కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కి ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించగా శంకర్ ఈ సినిమాని ఎంతో భారీ స్థాయిలో హై టెక్నీకల్ వాల్యూస్ తో నిర్మించారు. ఇక ఈ సినిమాలోని సాంగ్స్, సీన్స్, కథ, కథనాలు అన్ని కూడా ఆడియన్స్ ని అలరించాయి అని చెప్పకతప్పదు. దాని తరువాత ఇటీవల ఆ మూవీకి సీక్వెల్ గా 2. 0 మూవీ వచ్చింది.
రజినీకాంత్ హీరోగా అమీ జాక్సన్ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా బాగానే సక్సెస్ అయింది. అప్పట్లో భారత దేశంలోనే అత్యధిక ఖర్చుతో నిర్మితం అయిన మూవీ గా మంచి క్రేజ్ దక్కించుకున్న 2. 0 మూవీ లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే, త్వరలో ఈ మూవీ కి సీక్వెల్ గా తదుపరి భాగం సినిమాని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తీయడానికి దర్శకుడు శంకర్ సిద్ధం అవుతున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ 2, అలానే త్వరలో రామ్ చరణ్ తో మరొక మూవీ కూడా చేయనున్న శంకర్, అవి పూర్తి అయిన వెంటనే రెబల్ స్టార్ తో రోబో మూడవ పార్ట్ కోసం సిద్ధం అవుతారట.
ప్రస్తుతం తన బృందంతో కలిసి శంకర్ ఆ మూవీ స్టోరీ ని సిద్ధం చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయిన సినిమాల అనంతరమే ఇది ప్రారంభం అవుతుందని, అలానే టాలీవుడ్ కి చెందిన ఒక భారీ నిర్మాణ సంస్థ దీనిని కొన్ని వందల కోట్ల భారీ వ్యయంతో నిర్మించనుందని సమాచారం. మరి ఈ న్యూస్ కనుక నిజం అయితే తొలిసారిగా వెండితెరపై శంకర్, ప్రభాస్ ల భారీ మూవీ రోబో 3 ని చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: