సర్కారు వారి పాట లో ఆ సీన్ పూనకాలే!!

P.Nishanth Kumar
మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట అనే సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణ కుమారుడి గా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పటివరకు ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించగా హిట్ లు ఫ్లాప్ ల తో సంబంధం లేకుండా సినిమాలు సినిమాలు చేస్తూ వెళుతున్నాడు.

భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో మహేష్ బాబు  దూసుకుపోతున్నాడు. ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా బ్యాంకుల చుట్టూ జరిగే అవినీతి ని హైలెట్ చేస్తూ సందేశాత్మక కథకు కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే వరుసగా సందేశాత్మక చిత్రాల్లో నటిస్తున్న మహేష్ బాబు ఈ చిత్రంతో తన అభిమానులకు ఆలరించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. అందుకు అనుగుణంగానే ఇటీవలే విడుదలైన టీజర్ తో తన వింటేజ్ లుక్ తో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. 

ఈ చిత్రం మూడో షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ గోవా కి వెళ్ళింది. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన మరో షెడ్యూల్ హైదరాబాద్ నగరంలో ప్రారంభమయింది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈ షెడ్యూల్ లో బ్యాంక్ సెట్ లో షూట్ చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ను ప్రముఖ నటుడు సముద్రకని ఢీ కొట్ట బోతు ఉండగా వీరిద్దరి ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా ఉంటాయట. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా ఉంటాయని తెలుస్తోంది. మరి మీరు ఏ విధంగా నటించారో తెలియాలంటే ఈ సినిమా వచ్చే దాకా ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: