రాజేంద్రప్రసాద్ కు ఆమె అంటే ఎందుకంత ఇష్టం ..?

Divya

చలన చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా.. హీరోగా, కమెడియన్ గా, తండ్రిగా, స్నేహితుడిగా ఇలా ఎన్నో పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి , నటించిన ఘనత రాజేంద్రప్రసాద్ ది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. ఇకపోతే ఈయన తన భార్య సపోర్ట్ వల్ల సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు అనే విషయాన్ని రాజేంద్ర ప్రసాద్ పలుమార్లు వెల్లడించిన విషయం తెలిసిందే.. అసలు విషయానికొస్తే రాజేంద్రప్రసాద్ కు కో స్టార్ రజనీ అంటే చాలా ప్రత్యేకత అట..
ప్రముఖ దర్శకుడు జంధ్యాల దర్శకత్వం వహించిన సినిమా ఆహనా పెళ్ళంట.. ఈ సినిమా 1987వ సంవత్సరంలో వీరిద్దరి కాంబినేషన్ లో విడుదలైంది.ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ - రజనీ ల మధ్య సాగిన రొమాంటిక్ సీన్స్ అలాగే కెమిస్ట్రీ అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు అని చెప్పవచ్చు.. ఈ సినిమాతో పాటు గుండమ్మ గారి కృష్ణుడు, జీవన దొంగ ,భలే మొగుడు, చిక్కడు దొరకడు , భామా కలాపం ,బంధువులొస్తున్నారు జాగ్రత్త, గడుగ్గాయి, చలాకీ మొగుడు చాదస్తపు పెళ్ళాం వంటి ఎన్నో సినిమాలలో కలిసి జంటగా నటించారు..
సాధారణంగా ఆనాటి కాలంలో సినిమా సెట్ పై హీరో హీరోయిన్లు పెద్దగా మాట్లాడుకునేవారు కాదు..కానీ రజనీతో రాజేంద్రప్రసాద్ చాలా సన్నిహితంగా ఉండేవాడు.. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందని వార్తలు కూడా అప్పట్లో సంచలనం సృష్టించాయి.. అయితే ఈ విషయాలన్నింటి పై హీరోయిన్ రజనీ స్పందించింది.. సినీ ఇండస్ట్రీలో హీరోగా రాజేంద్రప్రసాద్ నటిస్తున్న సమయంలో ఆయనతో నటించడానికి ఏ ఒక్కరు ముందుకు రాలేదు. అలాంటి సమయంలో స్టార్ హీరోలైన బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ,అర్జున్ లాంటి హీరోలతో కలిసి నటించిన రజనీ మొదటిసారిగా రాజేంద్రప్రసాద్ తో కలిసి నటించడానికి వచ్చింది.
ఇక ఆ గౌరవంతోనే రాజేంద్రప్రసాద్ తనకు తన కుటుంబానికి చాలా దగ్గరయ్యాడు అని, ఆమె ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాడు అని రజనీ తెలిపింది. అంతే కాదు భోజనం చేసే వరకు తనతోనే కూర్చోవడం,  తన గురించి అన్ని విషయాలు తెలుసుకోవడం లాంటివి చేస్తూ ఉన్న సమయంలో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అనుకుని , మా మధ్య ఏదో ఉందని వార్తలు రాయడం మొదలు పెట్టారు అని తెలిపింది రజనీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: