కొరటాల కు ఎన్టీఆర్ షాక్.. అలా అయితేనే సినిమా!!

P.Nishanth Kumar
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా ప్రస్తుతం రాజమౌళి సినిమాను పూర్తి చేసే పనిలో ఎన్టీఆర్ ఉన్నాడు. ఈ సినిమా విడుదల సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని తొందరగా కంప్లీట్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. అయితే కొరటాల శివ ఆచార్య సినిమాను ఇంకా పూర్తి చేయకపోవడంతో ఆయన మరో ఆలోచన కూడా చేస్తున్నాడని తెలుస్తోంది.

 చిరంజీవి హీరోగా కొరటాల శివ ఆచార్య సినిమాను తెరకెక్కిస్తు ఉండగా ఈ సినిమా చివరి దశ షూటింగ్ లో ఉంది.  కొరటాల శివ కూడా ఈ చిత్రాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విడుదల చేసి తన తదుపరి సినిమాకు వెళ్లాలని భావిస్తుండగా చిరంజీవి ఎంతకీ ఈ సినిమాను విడుదల చేయకపోవడం ఆయనకు కూడా పెద్ద సమస్యగా మారింది. మరొక వైపు ఎన్టీఆర్ కూడా కొరటాల శివ పై తన సినిమా గురించి కొంత ఒత్తిడి కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. 

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన మనసు మార్చుకోకుండా ఉండాలంటే కొరటాల శివ ఏం చేస్తాడో చూడాలి. అసలే రాజమౌళితో సినిమా చేయడం వల్ల ఎన్టీఆర్ గత రెండు సంవత్సరాలుగా తనకు సంబంధించిన ఏ సినిమా కూడా విడుదల చేయలేక పోయాడు. వచ్చే సంవత్సరం అయినా రెండు మూడు సినిమాలను విడుదల చేయాలని ఆయన ప్రయత్నాలు చేస్తుండగా తొలి సినిమానే ఇంకా రాక పోవడం ఎన్టీఆర్ లో టెన్షన్ పెత్తిస్తుందట. ఈ నేపథ్యంలో ప్రశాంత్ మరియు త్రివిక్రమ్ సినిమాలు అనౌన్స్ అయ్యి ఉన్న నేపథ్యంలో కొరటాల శివ రావడం లేట్ అయితే వారితో సినిమాలు చేయాలని భావిస్తున్నాడట. కే జి ఎఫ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంచిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను కూడా దాదాపుగా ఆఖరి స్టేజ్ షూటింగ్ కి తీసుకువచ్చాడు. మరి కొరటాల శివకు షాక్ ఇచ్చేలా ఉన్న ఈ న్యూస్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: