ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

Divya
టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది నటి సమీరారెడ్డి. ఇక ఈమె ఎన్టీఆర్ తో కలిసి సినిమాలలో నటించింది. ఇక వివాహం చేసుకున్న తర్వాత ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. కానీ ఎప్పుడు సోషల్ మీడియా కు బాగా దగ్గరగా ఉంటుంది. తన కుటుంబ సభ్యులకు సంబంధించి ఎటువంటి ఫోటోలైన, వీడియోలైన షేర్ చేస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో..

అయితే ఈమె తాజాగా తన తండ్రితో.. తనకు తెల్ల జుట్టు వచ్చింది అని, వృద్ధాప్య ఛాయల గురించి మాట్లాడుతున్న వున్న సన్నివేశాలను తమ అభిమానులతో పంచుకున్నది. తన జుట్టు కి ఎందుకు రంగు వేసుకోలేదని తన తండ్రి అడిగినట్లుగా సమీరారెడ్డి తెలియజేసింది. తెల్ల జుట్టు ను ఎందుకు కవరప్ చేయాలి అని  తన తండ్రిని  సమీరారెడ్డి అడిగినట్టుగా  తెలియజేస్తోంది. ఇక అంతే కాకుండా తన అభిమానులు తన వైట్ హెయిర్ గురించి ఏం మాట్లాడుకుంటారో అని ఆయన ఆందోళన చెందుతున్నాడని తెలియజేసింది.
ఆయన అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం ఇలా ఇచ్చాను అంటూ.. ప్రజలు తన తెల్ల వెంట్రుకల గురించి మాట్లాడితే.. నేను ముసలి బామ్మ ని అయిపోయినట్లేనా? లేక అందంగా లేనంటారా? లేదా నేను శుభ్రంగా లేనట్లేనా? అని కొన్ని ప్రశ్నలను ప్రశ్నించింది. అప్పట్లో లాగా నా జుట్టు లేదని బాధపడడం లేదన్నాను. నాలో ఆ స్వేచ్ఛ ఇప్పుడిప్పుడే పరిమళిస్తుంది అని తెలుపుతూ వచ్చింది.
అప్పట్లో నేను వారానికి రెండు మూడు సార్లు తన జుట్టు కి రంగు వేసుకునే దాన్ని.. అందుకోసమే అప్పటి  నా వైట్ హెయిర్ గురించి ఎవరికీ తెలియకపోవచ్చు.. కానీ ఇప్పుడు వీలైనప్పుడు మాత్రమే తన హెయిర్ కు రంగు వేసుకుంటానని.. తెలిపింది సమీరారెడ్డి ఇంస్టాగ్రామ్ ద్వారా. ఏది ఏమైనా తన బ్యూటీ గురించి అభిమానులతో సమీరా రెడ్డి పంచుకోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మేకప్ వేసి తమను తాము కవర్ చేసుకుంటున్నారని కూడా తెలుపుతూ వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: