క‌రణ్ జోహార్ హోస్ట్ గా 24 గంట‌ల బిగ్ బాస్.. !

MADDIBOINA AJAY KUMAR
మనదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్ బాస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు హిందీ బిగ్ బాస్ 14 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ షోకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికీ బిగ్ బాస్ లోకి వెళ్ళిన సెలబ్రిటీలకు ఎంతో ఆదరణ వస్తోంది. దాంతో వారు హౌస్ నుండి భ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత టీవీ షోలలో సినిమాల్లో సందడి చేస్తున్నారు. ఇక ఎంతో ప్రజాదరణ పొందిన బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా టీవీ లో అయితే గంటన్నర రెండు గంటలు ప్రసారమైన బిగ్ బాస్ షో ఇప్పుడు 24 గంటలు ప్రసారం కావడం అనేది చెప్పుకోదగ్గ విషయమే. 

గంట రెండు గంటలు సెలబ్రిటీల జీవన విధానాన్ని చూసి ఎంతో వినోదాన్ని పొందిన అభిమానులకు... ఇప్పుడు 24 గంటలు సెల‌బ్రెటిలు ఎలా ఉంటారు ఏం చేస్తారు అన్నది చూడాల‌ని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ నిర్ణయంతో ఓటీటీకి కూడా మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇక హిందీ లో రాబోతున్న ఓటీటీ బిగ్ బాస్ 15 హోస్ట్ గా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే గత సీజన్ల‌లో ఈ షో టీవీల‌లో ప్ర‌సారం కాగా 14 సీజ‌న్ల‌కు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించారు. ఇక బిగ్ బాస్ 15 సీజ‌న్ 6 వారాల పాటు కొనసాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే సెలబ్రిటీల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయినట్టు సమాచారం.

అంతేకాకుండా ఈసారి బిగ్ బాస్ లో మరిన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఓటీటీలో ప్రసారం ముగిసిన తర్వాత దీనిని టీవీ లో టెలికాస్ట్ చేసేందుకు కూడా నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇదిలా ఉండగా కరణ్ జోహార్ బాలీవుడ్ లో వివాదాస్పద నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతరం క‌ర‌ణ్‌ పై సంచలన ఆరోపణలు వచ్చాయి. క‌ర‌ణ్ జోహార్ టాలెంట్ ఉన్న వాళ్ళతో సినిమాలు చేయకుండా కేవలం ఇండ‌స్ట్రీలోకి వారసత్వంగా వచ్చిన వారితోనే సినిమాలో చేస్తారని ఆరోపణలు వచ్చాయి. మరి ఇలాంటి నేపథ్యంలో కరణ్ జోహార్ బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ షో కు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: