అప్పుడు మెచ్యూరిటీ లేక వాటికి నో చెప్పా.. యువ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

praveen
విలక్షణమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకుంటూ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.  మొదట 'అ'అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు అనే విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కల్కి సినిమాతో మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.  ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జాంబి రెడ్డి అనే సినిమా  మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 అయితే తెలుగు చిత్ర పరిశ్రమ లో వస్తున్న మొదటి జాంబి సినిమా  ఇదే కావడం గమనార్హం. అయితే ఈ సినిమా భయపెట్టడం తో పాటు  కడుపుబ్బ నవ్విస్తుంది అని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెబుతున్నాడు.  ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శరవేగంగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్ర బృందం.  ఈ సినిమాలో ప్రధానపాత్రలో చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ప్రస్తుతం మంచి క్రేజ్ సంపాదించుకుని  దూసుకుపోతున్న తేజ సజ్జ నటించగా ఇక హీరోయిన్గా దక్ష నాగర్కర్  నటించింది.

 అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ దక్ష  పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తన తొలి చిత్రం హోరాహోరి అంటూ చెప్పుకొచ్చింది. బీబీయే  మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో..  తేజ గారి దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో ఈ సినిమా చేశానని చెప్పుకొచ్చింది. ఇక ఆ తరువాత చదువు కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చాను అంటూ తెలిపింది. 'అ' సినిమాలో నిత్యామీనన్ పాత్రలో నటించను అంటూ తెలిపింది.  ఆ సమయంలో మెచ్యూరిటీ లేక ఎన్నో ఆఫర్లకు నో  చెప్పానని కానీ ఇప్పుడు మాత్రం వస్తే ప్రతి ఆఫర్ కి ఎస్  చెప్పేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: