మనీ: మీ డబ్బును రెట్టింపు చేసే సరికొత్త స్కీం..!!

Divya
ఇప్పటికే ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే పోస్ట్ ఆఫీసులు కూడా రకరకాల సేవలను అందిస్తున్నాయి.. ఎందుకంటే సమాజంలో పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా మంచి లాభాలను పొందాలి అన్న ఉద్దేశంతోనే పోస్టాఫీసు లతోపాటు బ్యాంకులు కూడా సరికొత్త సేవలను అందిస్తూ కస్టమర్లకు ఆసరాగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోస్టాఫీసులు ప్రవేశపెడుతున్న ఎన్నో పథకాల ద్వారా ప్రజలకు కూడా మంచి బెనిఫిట్స్ కూడా లభిస్తున్నాయి..

ఇప్పటికే పోస్ట్ ఆఫీస్ లు పలు రకాల స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ప్రజలకు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.. ఒకవేళ మీరు కనుక ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో డబ్బులు జమ చేసినట్లయితే ఎన్నో రకాలుగా లాభాలను కూడా పొందవచ్చు.. వీటిలో డబ్బులు పెట్టడం వల్ల మీకు ఎటువంటి రిస్క్ కూడా ఉండదు.. అంతేకాదు మీరు పెట్టే పెట్టుబడిపై వడ్డీ కూడా లభిస్తుంది.. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్కీం యొక్క పూర్తి వివరాలు గురించి మనం తెలుసుకుందాం..

పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన ఎన్నోరకాల సేవలలో కిసాన్ వికాస్ పత్ర పథకం కూడా ఒకటి.. ఇందులో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా రెట్టింపు అయిపోతాయి. మీరు ఎంత అయినా ఇన్వెస్ట్ చేయవచ్చు. కనిష్టం, గరిష్టం అని సంబంధం లేకుండా మీరు పెట్టిన పెట్టుబడికి కచ్చితంగా రెట్టింపు స్థాయిలో డబ్బులు అయితే వస్తాయి. ఈ పథకంపై ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు 6.9 శాతం వడ్డీ కూడా లభించడం గమనార్హం.. పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.. కానీ మీ డబ్బులు రెట్టింపు కావాలంటే మాత్రం మీరు 124 నెలల పాటు వేచి ఉండాలి.
ఇక 50 వేల రూపాయలకు పైగా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే, పాన్ కార్డును కూడా జమ చేయాల్సి ఉంటుంది. ఇక ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: