మనీ: రైతులకు శుభవార్త.. త్వరలో వారి ఖాతాల్లో..!!
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందించే డబ్బులను అక్టోబర్ లేదా నవంబర్ నెలలో రెండు వేల రూపాయలను మీ ఖాతాలో జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తరువాత డిసెంబర్ లో మరో రెండు వేల రూపాయలను జమ చేస్తామని చెప్పడం గమనార్హం.. ఇక ఈ మొత్తం నాలుగు వేల రూపాయలను పొందాలంటే సెప్టెంబర్ 30 తేదీ లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు.. ముఖ్యంగా పీఎం కిసాన్ నిధి యోజన పోర్టల్లో మీ పేరును నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.. అన్ని విధాల మీ దరఖాస్తు ఆమోదించబడినట్లయితే అక్టోబర్ నెల నుంచి నాలుగు వేల రూపాయలను పొందవచ్చు..
ఇక రైతులకు మరో శుభవార్త ఏమిటంటే, ఇప్పటికే రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం, దానిని రెట్టింపు స్థాయిలో అనగా పన్నెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ పథకం ద్వారా సుమారుగా 12.14కోట్ల మంది రైతు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ,పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.