LIC నుంచి మహిళలకు అదిరిపోయే ప్లాన్...

Purushottham Vinay
ఇండియాలో పెద్ద బీమా రంగ కంపెనీ గా పేరు తెచ్చుకున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా lic జనాలకు ఎన్నో రకాల మంచి మంచి పాలసీలను అందిస్తోంది. ఇక వీటిల్లో పిల్లల దగ్గరి నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు కూడా వారికి ఎంతగానో అనువైన చక్కటి పాలసీలు అనేవి ఉన్నాయి.ఇక ఎల్‌ఐసీ మహిళలకు కూడా అదిరిపోయే ఒక ప్రత్యేక పాలసీని అందిస్తోంది. ఇక దీని పేరు ఎల్‌ఐసీ ఆధార్ శిలా.ఈ పాలసీ కేవలం మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆర్థిక భద్రత ఇంకా పొదుపు వంటివి లక్ష్యంగా ఎల్‌ఐసీ ఆ పాలసీని తీసుకురావడం జరిగింది.8 నుంచి 55 సంవత్సరాల మధ్యలో వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవడానికి తగిన అర్హులు. ఆధార్ శిలా పాలసీ తీసుకున్న వారు కనుక అకస్మాత్తుగా మరణిస్తే.. వారి కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ డబ్బులు అనేవి లభిస్తాయి. ఇక అలాగే పాలసీదారుడు కనుక బ్రతికి ఉంటే వారికి మెచ్యూరిటీ తర్వాత పాలసీ డబ్బులు వారికే చెల్లించడం జరుగుతుంది.

ఇక ఈ పాలసీ టర్మ్ అనేది 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో ఇక మీకు నచ్చిన టర్మ్ ఎంచుకోవచ్చు. ప్రీమియం డబ్బులను నెల, మూడు నెలలు, ఆరు నెలలు ఇంకా అలాగే ఏడాది చొప్పున చెల్లించొచ్చు.ప్రీమియం డబ్బులు ఇంకా డెత్ క్లెయిమ్‌పై పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో కనీసం 75 వేల రూపాయల మొత్తానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.3 లక్షల వరకు మొత్తానికి ఈ పాలసీని పొందొచ్చు. ఉదాహరణకు 25 సంవత్సరాల వయసులో ఉన్న వారు రూ.3 లక్షల మొత్తానికి ఎల్‌ఐసీ ఆధార్ శిలా పాలసీ తీసుకున్నారని మనం అనుకుందాం.పాలసీ టర్మ్  వచ్చేసి 20 ఏళ్లు. ఇప్పుడు వీళ్లకు నెలకు వచ్చేసి రూ.900 వరకు ప్రీమియం అనేది పడుతుంది. అంటే వీరు రోజుకు 30 రూపాయలు ఆదా చేస్తే సరిపోతుంది. ఇక వారికి మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ.4 లక్షల వరకు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: