మనీ : సులభంగా ధనయోగం పట్టాలంటే ఇలా చేయండి..?

Divya
ప్రస్తుత ప్రజా ప్రపంచంలో డబ్బు అవసరం లేనిది ఎవరికి..? చివరికి మంచి నీళ్లు తాగాలి అన్నా డబ్బును వెచ్చించక తప్పలేదు.. అందుకే డబ్బును.. ప్రపంచంలో అన్నింటికీ డబ్బే మూల కారణం అని చెబుతుంటారు మన పెద్దవాళ్ళు.. అయితే ఈ డబ్బు మనకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చడంతోపాటు సకల విలాసాలను మనకు చేకూరుస్తుంది. అంతేకాదు ఈ డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడపడమే కాకుండా .. అనుకున్న ప్రతి కోరికను తీర్చుకునేలా చేస్తుంది. అయితే అందరికీ ఈ అదృష్టం వరిస్తుంది అని చెప్పడం మాత్రం అసంభవం. ఎందుకంటే కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా సరే వారి చేతిలో వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది

మరికొంతమంది కొంత డబ్బు సంపాదించినా వారి చేతిలో సకల సౌకర్యాలు ఉంటాయి.. మన పెద్ద వాళ్ళు పడితే ధనయోగం పట్టాలి అని అంటారు. అలా ఎందుకు అంటే, మనకు కనక ధనయోగం పట్టింది అంటే.. సిరిసంపదలతో హాయిగా జీవించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా అందరికీ ధనయోగం పడుతుందా..? అంటే పట్టదు కొంతమందికి ధన యోగం లేదు అని ఆలోచిస్తున్నారు అలాంటి వారు కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి..

ముఖ్యంగా మన శరీరంలో పాజిటివ్ ఎనర్జీ నింపుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఏ విషయం అయినా సరే ఆచితూచి అడుగు వేస్తూ ఇతరులతో మంచిగా మాట్లాడుతూ జీవితాన్ని కొనసాగించాలి. డబ్బులను మనం ఎక్కడ ఎక్కువగా వృధా చేస్తున్నామో కూడా గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు అప్పుడప్పుడు దేవాలయాలను సందర్శిస్తూ.. మనశ్శాంతిగా ఉంటూ జీవితాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాదు డబ్బును ఆదా చేయడంలో కొన్ని సులభమైన మార్గాలను ఎంచుకోవాలి. డబ్బులు ఏ రూపంలో ఏ విధంగా దాచాలని అనుకున్నారో  తెలుసుకొని ఆదా చేయడం వల్ల అతి తక్కువ సమయంలో నే  డబ్బులు సంపాదించవచ్చు.
ఇక ముఖ్యంగా శాస్త్రం ప్రకారం ధనయోగం పట్టాలి అంటే.. గోమాతలకు గురువారం సాయంత్రం సమయంలో 5 కేజీల గోధుమపిండితో, ఒక కేజీ బెల్లం కలిపి చపాతీలు చేసి వాటిని ఆహారంగా పెట్టాలి.. అప్పుడు సర్వదేవతలను తనలో ఇమిడి ఉంచుకున్న గోమాత.. మనల్ని ఆశీర్వదించి మనకు ధనప్రాప్తి కలిగిస్తుంది అని పురోహితులు విశ్వసిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: