మనీ : ఎల్ఐసి నుంచి అదిరిపోయే సరికొత్త స్కీం..

Divya
ఎల్ఐసి.. భారతదేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన ఇన్సూరెన్స్ కంపెనీ.. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రవేశపెట్టిన సరి కొత్త పథకాలు ఎంతో మంది భవిష్యత్తుకు భరోసా ఇస్తాయని చెప్పవచ్చు. ఇందులో ప్రతి నెలా కొంత మొత్తంలో ప్రీమియం చెల్లించడం వల్ల, మనకు నిర్ణీత కాలం ముగిసిన తర్వాత, పెన్షన్ రూపంలో డబ్బులు రావడం గమనార్హం. అంతే కాదు ఇందులో డబ్బులు దాచుకోవడం వల్ల సెక్యూరిటీ ఉండడంతోపాటు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవితాన్ని కొనసాగించవచ్చు.

ఈ ఎల్ ఐ సి లో మనం ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ చివరిగా ఎక్కువ మొత్తంలో రాబడిని పొందవచ్చు. ఇప్పుడు ప్రవేశపెట్టిన సరికొత్త పాలసీ ఏదంటే జీవన్ ఉమాంగ్ పాలసీ. ఇందులో మూడు నెలల చిన్నారుల నుంచి 55 సంవత్సరాల వరకు ఉన్న పెద్దలు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ మీకు వంద సంవత్సరాలు వచ్చే వరకు కూడా మీకు పెన్షన్ రూపంలో డబ్బులు ఇస్తుంది. అంతే కాదు ఇందులో లోను కూడా పొందే వెసులుబాటు కల్పించబడింది. ఇక ఇందులో4 టెన్యుర్ లు ఉంటాయి. అది 15 సంవత్సరాలకు, 20 సంవత్సరాలకు, 25 సంవత్సరాలకు, 30 సంవత్సరాలకు.

అయితే ఇందులో మీరు ప్రతి నెల రూ. 1302 రూపాయలను ప్రీమియం కింద చెల్లించడం అంటే, రోజుకు నలభై మూడు రూపాయల చొప్పున పోగు చేస్తూ సంవత్సరానికి 15,298 రూపాయలను ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇందులో సాధారణంగా 7.1 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. కాబట్టి మీరు 30 సంవత్సరాల పాటు పాలసీ తీసుకుంటే రూ.4.58 లక్షలు మీరు కట్టిన వాళ్లు అవుతారు. ఇక ప్రతి సంవత్సరం కొత్త రిటర్న్స్ వస్తాయి. కాబట్టి అంతా కలిపి సంవత్సరానికి రూ.40,000 అవుతుంది. అలా  మీరు ప్రతి సంవత్సరం డబ్బులు విత్డ్రా చేసుకున్నట్లయితే మీకు వంద సంవత్సరాలు పూర్తయ్యేసరికి మీ చేతికి రూ.27.68 లక్షలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

LIC

సంబంధిత వార్తలు: