మానసికంగా కుంగిపోతున్నాను అంటున్న రష్మిక....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్నా స్టార్ హీరోయిన్ లలో రష్మిక మందన్న గురించి ఉన్నా క్రేజ్ ప్రత్యేకంగా చెప్పానాక్కరలేదు. ఆమెకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంత ఇంత కాదు.ఆమె తెలుగు లో చేసిన సినిమాలు ఐనా ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ మూవీస్ తో ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్‌గా పేరు సంపాదించింది. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో జతకట్టి చేసిన  ‘పుష్ప’తో ఏకంగా పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌ను ఆమె కైవసం చేసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఆమె కన్ను పడింది అప్పటి నుండి ఆమె మన టాలీవుడ్ లో సినిమాలు చేయడం తగ్గించింది. ఆమె బాలీవుడ్ లో ‘గుడ్ బై’ మూవీ తో ఉత్తరాదిన ఎంట్రీ ఇచ్చింది. ఐతే ఆ సినిమా రిజల్ట్స్ ఆమెను నీరసకు గురి చేసింది. కనుకనే ఇపుడు రాబోతున్న ‘మిషన్ మజ్ను’ సినిమా పైనే రష్మిక అసలు పెట్టుకుంది. ‘మిషన్ మజ్ను’ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన ఆమెగత కొద్దికాలంగా ఆమె నేటింట్లో తన మీద వస్తున్నా అభియోగాలపై స్పందించింది.
దాంట్లో భాగంగానే ఆమె తన లైఫ్ లో  తాను చేసే ప్రతి పని మీదా ట్రోల్ల్స్ వస్తున్నాయి అని చెప్పిన రష్మిక  తన తప్పేంటో చెబితే వినడానికి రెడీ గా ఉన్నానని చెప్పింది. వాళ్ళు చేసే కామెంట్స్ నాకు అర్ధం కావటంలేదని అవి ఏమైనా ఉంటే అర్థమయ్యేలా చెప్తే బాగుంటుందని అన్నది. ఆలా అర్ధం కాకుండా చేసే ట్రోల్ల్స్ తనను బాగా డిప్రెషన్ కి గురి చేస్తున్నాయని చెప్పింది.అలాగే ఆమెకు తరసపడిన ఇంకొక ప్రశ్న ఏంటంటే నేషనల్ క్రష్‌గా ఆడియన్సెస్ లో పేరు తెచ్చుకున్న మీ క్రేజ్ మరియు పాపులారిటీని ఎప్పుడైనా వదులుకోవాలని అనిపించిందా? అనే ప్రశ్నకు ఆమె కొన్నిసార్లు అలానే అనిపించిందని చెప్పింది. ఎందుకు అని అడగగా డానికి సమాధానంగా ఆమె ‘ఎందుకంటే జనాలకు నా బాడీతో కూడా సమస్యలు ఉన్నాయి. నేను ఎక్కువ వర్కవుట్ చేస్తే మగాడిలా కనిపిస్తున్నానంటారు. కొంచం లావు ఎక్కితే చాలా లావుగా ఉన్నానంటారు. అతిగా మాట్లాడితే నేను  భయపడుతున్నానని, అస్సలు మాట్లాడకపోతే ‘యాటిట్యూడ్’ చూపిస్తున్నానని అని పేర్లు పెడతారు. నేను ఊపిరి తీసుకున్నా, తీసుకోకపోయినా వారికి పెద్ద ప్రాబ్లెమ్ అంటే నేనేం చేయాలి. ఈ రంగంలో ఉండాలా? వదిలేసి వెళ్లిపోవాలా’ అని రష్మిక తన బాధను వ్యక్తం చేసుకుంది.
ఐతే దీంట్లో భాగంగానే నా పైన ట్రోల్స్ చేసేవాళ్లు తనలో ఎలాంటి చేంజ్ ను కోరుకుంటున్నారో  చెబితే వింటానని డానికి అనుగుణంగానే మార్చుకుంటానని రష్మిక చెప్పుకొచ్చారు. కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం తానేం చేయలేనని తేల్చి చెప్పారు. ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే చెప్పాలి గానీ అసభ్య కరమైన పదజాలం వాడకూడదని చెప్పారు. ఇకపోతే, ఇళయదళపతి విజయ్ తో కలిసి చేసిన మూవీ ‘వారసుడు’తో సంక్రాంతికి హిట్ అందుకున్న రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2’లో నటిస్తోంది. ఈ సినిమా వైజాగ్‌లో ఇటీవల ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఐతే ఇందులో సీనియర్ నటుడు ఐనా జగపతి బాబు మాత్రం ఒక మెయిన్ రోల్ లో చేస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: