చిరంజీవి భోళా శంకర్ సినిమాలో మళ్లీ మార్పులు..!
ఈ క్రమంలోనే అభిమానుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలను రూపొందించాలని నిర్ణయించుకున్న చిరంజీవి ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తాను నటించబోతున్న భోళా శంకర్ సినిమాలో పలుమార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం . ఇప్పటికే భోళా శంకర్ సినిమాలో కొన్ని మార్పులు చేసిన చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని మరికొన్ని మార్పులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా తమన్నా , స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చెల్లెలు పాత్రలో కనిపించబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలను రీ షూట్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య సినిమా విజయాన్ని దృష్టిలో పెట్టుకొని చిరంజీవి ఇప్పుడు కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఆ కీలక సన్నివేశాలను ఫిబ్రవరిలో రీ షూట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా మినిమం గ్యారంటీ అనేటట్టుగా ఉండడానికి చిరంజీవి సాయ శక్తుల ప్రయత్నిస్తున్నాడని సమాచారం. సమ్మర్ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.