2M మార్క్ తో దూసుకుపోతున్న వాల్తేరు వీరయ్య..!

Divya
తాజాగా బాబి కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి.. మాస్ మహారాజా కలిసి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో చాలా గ్రాండ్గా విడుదలై మొదటి షో తోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా మూడు రోజుల్లోనే ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేసి దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా నాలుగవ రోజు కనుమ పండుగ సందర్భంగా మరింత దూసుకుపోయింది. ముఖ్యంగా అన్నిచోట్ల అనుకున్న దానికంటే బెటర్ గా కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ ముందంజలో నిలిచింది ఈ సినిమా.
తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ పక్కన పెడితే ఓవర్సీస్ లో కూడా 2 మిలియన్ మార్కుతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో 1.9 మిలియన్ మార్క్ దాటినట్లు అధికారికంగా పోస్టర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. వాల్తేరు వీరయ్య సినిమా 1.9 మిలియన్ మార్కుకు చేరుకోగా.. వీరసింహారెడ్డి సినిమా వన్ మిలియన్ మార్క్ క్రాస్ చేసినట్లు USA బృందం వెల్లడించింది. దీంతో సంక్రాంతి బరిలో 3 రోజుల్లోనే రూ.108 కోట్ల కలెక్షన్ వసూలు చేసి రికార్డు సృష్టించింది వాల్తేరు వీరయ్య సినిమా. మరోవైపు వీరసింహారెడ్డి సినిమా నాలుగు రోజుల్లో రూ.104 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది.
ముఖ్యంగా నాలుగవ రోజు కూడా హౌస్ ఫుల్ బోర్డులతో  తెలుగు రాష్ట్రాలలో రూ. 11 కోట్ల మేర కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా బాగున్నాయని తెలుస్తోంది.  ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా సినిమా బాక్సాఫీస్ వద్ద 11.5 కోట్లకు పైగా షేర్ ను అందుకుంది. మొత్తానికి అయితే సంక్రాంతి విజేతగా కోలీవుడ్లో అజిత్ తెలుగులో చిరంజీవి దూసుకుపోతున్నారని చెప్పవచ్చు. మరి చిరంజీవి భారీ రేంజ్ లో విజయం సాధించి పూర్వవైభవాన్ని పొందారు అని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: