ఉపాసన ప్రెగ్నెన్సీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా డాటర్..!?

Anilkumar
 ఉపాసన మరియు రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక ఈ వార్త విన్న మెగా కుటుంబం మరియు మెగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.ఇక మెగాస్టార్ ఈ వార్తని అధికారికంగా ప్రకటించిన తరువాత నుండి ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా ఈ వార్త వైరల్ అవుతుంది. దాదాపు వివాహం జరిగిన పదేళ్ల తర్వాత ఉపాసన తల్లి అయింది అన్న వార్త మెగా కుటుంబానికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అయితే తాజాగా ఉపాసన ప్రెగ్నెన్సీ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే మొదట్లో సరోగసి పద్ధతి ద్వారా ఉపాసన బిడ్డలకు జన్మనివ్వబోతుంది అన్న వార్తలు వినిపించాయి.

దాని అనంతరం ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన తన ఫోటోలు ద్వారా ఈ వార్తల్లో వాస్తవం లేదు అని తేలిపోయింది. ఈ విషయానికి సంబంధించిన ఏదో ఒక సంతోషకర వార్తని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూనే ఉంది ఉపాసన. తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను షేర్ చేసింది ఉపాసన. ఇందులో భాగంగా ఈ సంక్రాంతి పండుగ తనకి ఎంతో ప్రత్యేకమైన మాతృత్వాన్ని ఆస్వాదించబోతున్నానని పేర్కొంది ఉపాసన.అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మెగా డాటర్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఉపాసన ప్రెగ్నెన్సీ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేయడం జరిగింది.

తాజాగా విడుదలైన వాల్తేరు వీరయ్యలో కాస్ట్యూమ్ డిజైనర్ గా సుస్మిత పనిచేసిన సంగతి మనందరికీ తెలిసిందే.. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ ఉపాసన రాంచరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారు అన్నది మా అందరికీ చాలా పెద్ద శుభవార్త. ఈ వార్త కోసం ఎన్నో ఏళ్లుగా మేమందరం  ఎదురు చూస్తున్నాం. త్వరలోనే నాకు మేనల్లుడు వస్తాడా మేనకోడలు వస్తాడా అన్నది ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. నాకైతే ఇద్దరిలో ఎవరైనా ఓకే.కానీ అబ్బాయి పుడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే మా కుటుంబంలో నలుగురు ఆడపిల్లలు ఉన్నాం. కాబట్టి మెగా కుటుంబానికి ఒక వారసులు వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చింది సుస్మిత ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: