ఇన్నేళ్లయినా.. ప్రియమణికి పిల్లలు ఎందుకు లేరో తెలుసా?

praveen
సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి అటు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. అదే సమయంలో ఇక కోలీవుడ్లో ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితురాలు అని చెప్పాలి. అయితే టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రియమణి ఇక తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది. తెలుగుతోపాటు తమిళ కన్నడ భాషల్లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడిపేది. స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. కానీ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస అవకాశాలను అందుకుంటుంది అని చెప్పాలి.

 అంతేకాదు  పలు బుల్లితెర కార్యక్రమాలపై కూడా సందడి చేస్తూ ఇక ప్రేక్షకులు అందరికీ కూడా మరింత దగ్గరవుతూ ఉంది అని చెప్పాలి. అయితే ప్రియమణి ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆయనకు ఇదివరకే పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ ప్రియమణి మాత్రం వెనకడుగు వేయకుండా ప్రేమను గెలిపించుకోవడానికి ముస్తఫా రాజ్ ను  పెళ్లి చేసుకుంది అని చెప్పాలి. అయితే వీరికి పెళ్లి జరిగి ఏళ్లు గడుస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా వీరికి పిల్లలు లేకపోవడం గమనార్హం. ఇక ప్రియమణి గుడ్ న్యూస్ చెప్తుందేమో అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

 నిజానికి ప్రియమణి భర్త ముస్తఫా రాజుకి పిల్లలు అంటే ఎంతో ఇష్టమట. కానీ ప్రియమణి మాత్రం ఇప్పుడే పిల్లలు వద్దని భర్తకు చెప్పేసిందట. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్ ల తో కూడా బిజీబిజీగా ఉంది ప్రియమణి. ఈ సమయంలో ఇక పిల్లల గురించి ఆలోచిస్తే తన బాడీ ఫిజిక్స్ మొత్తం మారిపోతాయని.. అంతేకాకుండా ఇక సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతాయని సినిమాల చేయాలని ఆసక్తి కూడా పోతుందిని ఆలోచనతో ఇక పిల్లలను ఇప్పుడే వద్దని భర్తకు చెప్పేసిందట. కొంతకాలం తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దామని చెప్పడంతో భర్త కూడా ఓకే చెప్పేసాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: