దిల్ రాజ్ వ్యూహాలను అర్ధం చేసుకోలేకపోతున్న ఇండస్ట్రీ వర్గాలు !

Seetha Sailaja

ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ లేటెస్ట్ గా అనుసరిస్తున్న వ్యూహాలు ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇవ్వడమే కాకుండా ఈప్రముఖ నిర్మాత ఎందుకు ఇలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటూ కొందరు షాక్ అవుతున్నారు. వాస్తవానికి దిల్ రాజ్ ఇండస్ట్రీలోని అందరికీ అందరి వాడిగా కొనసాగుతూ అతడి ప్రత్యేకమైన వ్యక్తిత్వం వల్ల ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.

ఈమధ్య అతడు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతూ ఉండటంతో దిల్ రాజ్ కు ఏమైందీ అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి సంక్రాంతి సమయంలో డబ్బింగ్ సినిమాలు ఇండస్ట్రీలో విడుదల కాకూడదు అంటూ ఎప్పటి నుంచో ఫిలిం చాంబర్ లో పెద్దమనుషుల మధ్య ఒప్పందం జరిగింది అంటారు. అయితే ఈవిషయాలను పట్టించుకోకుండా దిల్ రాజ్ తన వారసుడు మూవీని ఈనెల 11న విడుదలచేయాలని ఒక నిర్ణయానికి రావడంతో దిల్ రాజ్ ను టార్గెట్ చేస్తూ బాలకృష్ణ చిరంజీవిల అభిమానుల ట్రోలింగ్ దిల్ రాజ్ పై చాల ఎక్కువగా జరిగింది.

అయితే ‘వారసుడు’ మూవీని తెలుగు వెర్షన్ లో విడుదలచేయాలని దిల్ రాజ్ కూడ జనవరి 11న తన ‘వారసుడు’ రిలీజ్ అంటూ లీకులు ఇచ్చాడు. అయితే బాలకృష్ణ చిరంజీవిల అభిమానుల నుండి దిల్ రాజ్ ను టార్గెట్ చేస్తూ చాల నెగిటివ్ కామెంట్స్ చేసారు. ఈనెగిటివ్ కామెంట్స్ కు భయపడి కాబోలు ‘వారసుడు’ మూవీని 14కు వాయిదా వేసి తాను ఇండస్ట్రీలో అందరికీ ఆప్తుడుని అంటూ చిరంజీవి బాలకృష్ణల అభిమానుల కోపాన్ని చల్లార్చాడు.

ఈసంఘటన జరిగి కొన్నిరోజులు అవ్వకుండానే తిరిగి మళ్ళీ దిల్ రాజ్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనికికారణం ‘శాకుంతలం’ మూవీని ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పటికే అదే ఫిబ్రవరి 17న విశ్వక్ సేన్ నటించిన ‘ధంకీ’ కిరణ్ అబ్బవరం నటించిన ‘వినరో భాగ్యం విష్ణుకథ’ మూవీలు అదే డేట్ ను లాక్ చేసుకుంటూ విడుదల అవుతున్నట్లు ప్రకటించాయి. దీనితో ‘శాకుంతలం’ మూవీ మ్యానియా ముందు ఈచిన్న సినిమాలు ఎక్కడ నిలబడతా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనితో దిల్ రాజ్ ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నాడో ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: