మొదటి సారి పుట్టబోయే బిడ్ద గురించి స్పందించిన ఉపాసన..!?

Anilkumar
తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే త్రిబుల్ ఆర్ టీం కాలిఫోర్నియాలో నిర్వహించిన ఈ అవార్డుల దినోత్సవం లో పాల్గొన్నారు. అయితే ఇందులో భాగంగానే మొదటిసారి తనకి పుట్టబోయే బిడ్డ గురించి స్పందించింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన. ఇందుకుగాను ఆమె చాలా భావోద్వేగానికి గురవుతున్నట్లు చెప్పుకొచ్చింది.. అయితే రామ్ చరణ్ తో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం లో పాల్గొంది రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. 

ఇందులో భాగంగానే తను ఆనందాన్ని వ్యక్తం చేసింది..ఇక తన సోషల్ మీడియా వేదికగా త్రిబుల్ ఆర్ టీం తో కలిసి దిగి నా ఒక ఫోటోని షేర్ చేసింది..  త్రిబుల్ ఆర్ టీంలో నేను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది.. ఇది దేశం మొత్తం గర్వించే విజయం.. ఇలాంటి ఒక ప్రయాణంలో నేను కూడా భాగమయ్యేలా చేసిన రామ్ చరణ్ మరియు ఈ సినిమా దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు. నాతో కలిసి నా బేబీ కూడా ఈ అనుభూతిని పొందుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.. ఈ క్షణాలు చాలా భావోద్వేగంగా కూడా అనిపిస్తున్నాయి.. అని చెప్పుకొచ్చింది రామ్ చరణ్ సతీమణి ఉపాసన. ఇక దీంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

ఈ పోస్ట్ ని చూసిన చాలా మంది మెగా అభిమానులు ఉపాసనకి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇక గోల్డెన్ గ్లోబ్ వేదికగా త్రిబుల్ ఆర్ టీం కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.ఇందులో భాగంగానే టీం మొత్తం కలిసి దిగిన ఒక ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇందులో భాగంగానే రాజమౌళి భారతీయ చాటేలా ధోతి కుర్తా ధరించడాన్ని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు అంతేకాకుండా రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ రెడ్ కార్పెట్ పై ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో వాళ్ళ సతీమణులు కూడా వెనకే నిలుచుని చాలా గర్వపడుతున్నారు. ఇక ఈ ఫోటోలను చూసిన చాలామంది విశ్లేషకులు ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఖచ్చితంగా ఉంటుంది అని కామెంట్లను చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: