హీరోల వారసుల పై అడవి శేషు సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja

గత సంవత్సరం విడుదలైన ‘మేజర్’ ‘హిట్ 2’ సూపర్ సక్సస్ కావడంతో అడవి శేషుకు చాల ఆఫర్లు వస్తున్నాయి. అంతేకాదు అతడు డేట్స్ ఇస్తే మంచి పారితోషికం ఇస్తాము అంటూ చాలామంది దర్శక నిర్మాతలు శేషు చుట్టూ తిరుగుతున్నట్లు టాక్. అయితే ఇతడు మాత్రం తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించకుండా మంచి ప్రొడక్షన్ హౌస్ అలాగే మంచి కథ అన్న విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు.

ఈసంవత్సరం ఈయంగ్ హీరో నుండి రెండు సినిమాలు రాబోతున్నాయి. వాటికి సంబంధించిన షూటింగ్ లలో ఈ హీరో చాల బిజీగా ఉంటున్నాడు. ఇప్పటికే ‘గూఢాచారి’ సినిమా సీక్వెల్ ను ప్రకటించిన అడవి శేష్ మరి కొన్ని కథలను కూడ చర్చిస్తున్నాడు. తన సినిమాలకు సంబంధించిన కథలను తానే తన టీమ్ మెంబర్స్ తో ఆలోచించి వ్రాసుకునే అలవాటు శేషుకు ఉంది. ఈ అలవాటు వల్ల అతడి సినిమా కథలు చాల డిఫరెంట్ గా ఉండటంతో అతడికి వరసపెట్టి హిట్స్ వస్తున్నాయి అని కామెంట్స్ చేసేవారు కూడ చాలామంది ఉన్నారు.

ఈమధ్య ఒక మీడియా సంస్థకు వచ్చిన ఇంటర్వ్యూలో శేషు తాను ఎందుకు రచయితగా మారవలసి వచ్చింది అన్న విషయమై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈకామెంట్స్ టాప్ హీరోల వారసులను టార్గెట్ చేసేవిగా ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రతి టాప్ హీరో కుటుంబానికి చెందిన హీరోలు కనీసం ఇద్దరు ముగ్గురు ఉంటున్నారని వారి సంఖ్య అంతా కలుపుకుంటే 20 మంది అవుతారని నిరంతరం కథల గురించి అన్వేషణ సాగించే ఆ 20 మందిని దాటుకుని తన లాంటి హీరో వద్దకు ఒక మంచి కథ చేరాలి అంటే అది అసాధ్యంగా మారిందని అందుకనే తన సినిమాల కోసం తానే రచయితగా మారవలసిన పరిస్థితి ఏర్పడింది అంటూ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం  శేషు కామెంట్స్ ఇండస్ట్రీ లో  హాట్ టాపిక్ గా  మారాయి   అని అంటున్నారు 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: