శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయినా సమంత..!

Divya
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత తాజాగా శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొని కన్నీళ్లు పెట్టుకుంది. డైరెక్టర్ గుణశేఖర్ సమంతా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు నిజమైన హీరో సమంత అని ఆమె నటన గురించి మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆమెపై ప్రశంసలు వర్షం కురిపించారు. దీంతో ఎమోషనల్ అయినా సమంత కంటతడి పెట్టింది. ఇకపోతే తనకు మయో సిటీస్ వ్యాధి ఉందని చెప్పిన తర్వాత మొదటిసారి ఇలా మీడియా ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నాకు సినిమాపై ఉన్న ప్రేమ.. సినిమాకు నా మీద ఉన్న ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు" అంటూ తెలిపింది. గుణశేఖర్ గారు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి మరీ పని చేశారు.  ఈ కథ విన్నప్పుడు నేను ఊహించుకున్నట్లు రావాలి అని అనుకున్నాను. అయితే అంతకుమించి ఉంది అనేలా సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ అంటూ ఉంటే అనిపిస్తోంది . ఇండియన్ హిస్టరీలో కాళిదాసు రాసిన శకుంతల పాత్ర నాకు లభించడం.. నా పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నాను..
నా జీవితంలో ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా సరే సినిమాను ప్రేమిస్తూనే ఉంటాను. అంటూ సమంత మాట్లాడింది. అయితే సమంత చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే సమంత ఈ ఈవెంట్ కి సరికొత్తగా కనిపించింది. కళ్ళకు అద్దాలు ధరించి చేతిలో జపమాలతో పూర్తిగా ఆధ్యాత్మికం వైపు మనసు పెట్టిందని తెలుస్తోంది.. ఇదివరకే సాయి పల్లవి కూడా ఇప్పటికీ కూడా ఎక్కడికి వెళ్లినా ఆమె చేతిలో జపమాల కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సమంత కూడా తన చేతిలో జపమాలను పట్టుకుని తిరగడం ఆమె ఆధ్యాత్మిక వైపు వెళ్ళింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: