వెంకటేష్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న రీ రిలీజ్ మ్యానియా !

Seetha Sailaja

ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాల రీ రిలీజ్ మ్యానియా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభాస్ మహేష్ ల ఒకనాటి టాప్ హిట్ మూవీస్ ను కొత్త ప్రింట్స్ తో రీ రిలీజ్ చేసినప్పుడు మంచి స్పందన వచ్చింది. ఇక లేటెస్ట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’ సినిమా రీ రిలీజ్ కు వచ్చిన స్పందన చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయినట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 31న ‘ఖుషీ’ సినిమా ఆడుతున్న ధియేటర్ల వద్దకు వచ్చి పవన్ అభిమానులు చేసిన హడావిడి మరొకసారి పవన్ మ్యానియాను తెలియచేసింది. ఇప్పటికే చిరంజీవి బాలకృష్ణ సినిమాలు కూడ రీ రిలీజ్ కావడంతో టాప్ హీరోల సినిమాలకు ఏర్పడిన రీ రిలీజ్ మ్యానియా అందరికీ షాక్ ఇస్తోంది. ఇప్పుడు ఈ లిస్టులోకి సీనియర్ హీరో వెంకటేష్ కూడ చేరాలని గట్టి ఆలోచనలు చేస్తున్నట్లు టాక్.

వాస్తవానికి గతంలో వెంకటేష్ సినిమాలు చాలామటుకు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆతరువాత టాప్ యంగ్ హీరోలతో పోటీ పడే విషయంలో వెంకటేష్ బాగా వెనకపడినప్పటికీ అతడికి మినిమం గ్యారెంటీ హీరో అన్న ట్యాగ్ గతంలో వెంకీ సినిమాలకు ఉండేది. అయితే ఆతరువాత వరస ఫ్లాప్ లు వచ్చాక తిరిగి వెంకటేష్ ‘ఎఫ్ 2’ తో ఘనవిజయాన్ని అందుకోవడంతో నేటితరం ప్రేక్షకులకు కూడ వెంకటేష్ బాగా దగ్గర అయ్యాడు.

ఈమధ్యనే వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా అతడు నటించిన ‘నారప్ప’ సినిమాను విడుదల చేసినప్పటికీ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. దీనితో వెంకటేష్ ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా తన సినిమాలలో ఏ సినిమా రీ రిలీజ్ కు బాగుంటుంది అన్న విషయమై తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. వీరి చర్చలలో వెంకటేష్ నటించిన ‘బొబ్బిలిరాజా’ ‘ఘర్షణ’ ‘జెమినీ’ ‘ధర్మచక్రం’ సినిమాలు వెంకీ ఆలోచనలలో ఉన్నట్లు టాక్. దీనితో ఈమూడు సినిమాలలో ఏసినిమా రీ రిలీజ్ కు రెడీ అవుతుంది అన్నవిషయం త్వరలో తేలవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: