షాక్: సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పేసిందా..?

Divya
టాలీవుడ్ లో నాచురల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ సాయి పల్లవి. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా ఈమె గురించి పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇమే సినిమాలకు గుడ్ బై చెప్పేసిందని కేవలం వైద్యురాలిగా స్థిరపడాలని చూస్తోంది అంటూ పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఒక ఆసుపత్రిని కూడా నిర్మించబోతోంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందుచేతనే తన తదుపరిచిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అంటూ వైరల్ గా మారుతున్నాయి.

ఇక అందుకు తగ్గట్టుగానే సాయి పల్లవి గార్గి సినిమా తర్వాత మరే సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకోలేదు  అందుచేతనే ఈ వార్తలు మరింత వైరల్ గా అవుతున్నాయి. తాజాగా వీటిపై స్పందిస్తూ సాయి పల్లవి పలు ఆసక్తికరమైన వాక్యాలు చేసింది. అందం అన్నది రూపంలో కాదని గుణంలో ఉందని చెప్పే ప్రేమమ్ చిత్రంతో తన సినీ కెరియర్ మొదలైందని.. ఆ చిత్రం పెద్దగా విజయం సాధిస్తుందని అసలు అనుకోలేదని ఈ చిత్రంలో టీచర్ ఇమేజ్ను మార్చడానికి వేరే తరహా పాత్రలో నటించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానని తెలియజేసింది.

ఇక తాను ఎంబిబిఎస్ చదివిన నటిగా కావాలనుకున్నాను.. దీనికి తన తల్లిదండ్రులు ఏమాత్రం అడ్డు చెప్పలేదని తెలిపింది. నేను నటించిన చిత్రాలు పాత్రలు ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలని భావిస్తాను.. అందరూ కూడా తమ ఇంటి ఆడపడుచు గా భావించడం చాలా సంతోషంగా ఉంది. మంచి కథలు లభిస్తే భాషతో సంబంధం లేకుండా నటిస్తానని తెలియజేస్తోంది. దీంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పనుంది అంటూ వస్తున్న వార్తలు అసత్యమేనని తేలిపోయింది. సాయి పల్లవి తెలియజేసిన ఈ వాక్యాలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి సాయి పల్లవి తన కుటుంబంతో ఎక్కువగా వెకేషన్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: