"యూఎస్ఏ" లో వాల్తేరు వీరయ్య మూవీకి మామూలు క్రేజీ లేదుగా..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస మూవీలతో కుర్ర హీరోలకు పోటీగా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా పోయిన సంవత్సరం చిరంజీవి రెండు మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో మొదటగా చిరంజీవి "ఆచార్య" మూవీ తో ప్రేక్షకులను పలకరించగా ... ఆ తర్వాత గాడ్ ఫాదర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి మైత్రి మూవీ సంస్థ ఈ సినిమాను నిర్మించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అందాల ముద్దు గుమ్మ శృతి హాసన్ ఈ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మాస్ మహారాజా రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... మంచి టాలెంట్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి బాబీ సింహ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
 

ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని యూఎస్ఏ లో జనవరి 12 వ తేదీనే ప్రీమియర్స్ వేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూఎస్ఏ ప్రీమియర్ షో కు సంబంధించిన టికెట్ లు కూడా ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. వాల్తేరు వీరయ్య మూవీ కి ఇప్పటికే యూఎస్ఏ లో 150 కే ఫ్రీ సేల్స్ జరిగాయి. దీనిని బట్టి చూస్తే వాల్తేరు వీరయ్య మూవీ కి యూఎస్ఏ లో అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: