"వాల్తేరు వీరయ్య" మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ తెలిస్తే షాక్ కావాల్సిందే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం రెండు మూవీలతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. చిరంజీవి పోయిన సంవత్సరం ఆచార్య మూవీ తో మొదటగా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి కెరియర్ లో అప్పటి వరకు ఫ్లాప్ ఎరుగని కొరటాల శివ దర్శకత్వం వహించడం ... మెగాస్టార్ చిరంజీవి ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ లో కలిసిన నటించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులకు ఏ మాత్రం అలరించలేకపోయింది. ఆ తర్వాత చిరంజీవి "గాడ్ ఫాదర్" మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి "వాల్తేరు వీరయ్య" మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో బాబి సింహ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. బాబీ ఈ మూవీ కి దర్శకత్వం వహించండి. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ సినిమా యూనిట్ ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి అద్భుతమైన రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి ఆంధ్ర ఏరియాలో 40 కోట్లు ,  సీడెడ్ లో 14.5 ,  నైజంలో 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: