"వాల్తేరు వీరయ్య" ట్రైలర్ విడుదలలో మార్పు..?

Pulgam Srinivas
ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అద్భుతమైన రేంజ్ లో అలరిస్తున్న టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మొదటగా చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా ... ఆ తర్వాత గాడ్ ఫాదర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ లలో ఆచార్య మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. గాడ్ ఫాదర్ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి "వాల్తేరు వీరయ్య" మూవీ లో హీరో గా నటించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహించగా ... దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. రవితేజ ఈ మూవీ లో ఒక అద్భుతమైన కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... బాబీ సింహ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిరంజీవి మరియు రవితేజ లకు సంబంధించిన టీజర్ లను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా ... వాటికి సూపర్ రెస్పాన్స్ లభించింది.

అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ను జనవరి 4 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది అని మొదట వార్తలు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ను జనవరి 5 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ట్రైలర్ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: