న్యూ ఇయర్ కి హీరోయిన్లు పబ్ లలో ఉంటే.. సాయిపల్లవి మాత్రం?

praveen
సినిమా ఇండస్ట్రీలో అందాలు ఆరబోసి అవకాశాలు దక్కించుకునే హీరోయిన్లు ఎంతమంది ఉన్నప్పటికీ అందాల ఆరబోతను నమ్ముకోకుండా కేవలం తనలో ఉన్న టాలెంట్ తోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారు కొంతమంది ఉంటారు. ఇక నేటి జనరేషన్లో అలాంటి వారిలో సాయి పల్లవి మొదటి వరుసలో ఉంటారు అని చెప్పాలి. ఫిదా సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అన్ని భాషల్లో నటించింది. ఇక ఏ భాషలో నటించినా ఆ భాషకు తగ్గట్లుగా తనను తాను మార్చుకుంటూ ప్రేక్షకుల మధ్యలో చోటు సంపాదించుకుంటూ ఉంటుంది.

 అందాల ఆరబోత చేస్తేనే అవకాశాలు వస్తాయి అనుకుంటున్న నేటి జనరేషన్లో ఎక్కడ చిన్నచిన్న బట్టల జోలికి పోకుండా కేవలం నటనకు ప్రాధాన్యమున పాత్రలు మాత్రమే చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం తన చిరునవ్వుతో అందం అభినయంతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది అని చెప్పాలి. వైవిద్యమైన పాత్రలు చేసుకుంటూ ప్రస్తుతం బిజీ హీరోయిన్ గానే కొనసాగుతుంది సాయి పల్లవి. అయితే ఇటీవల సాయి పల్లవి మరోసారి అభిమానులు అందరినీ కూడా గర్వపడేలా చేసింది.

 సాధారణంగా అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సినీ సెలబ్రిటీలు ఎలా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఏకంగా తమ ప్రేమికులతో పబ్బులకు వెళ్లి తాగుతూ తూగుతూ తెగ ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు హీరో హీరోయిన్లు. కానీ సాయి పల్లవి మాత్రం న్యూ ఇయర్లో ఎంతో కొత్తగా సెలబ్రేషన్స్ చేసుకుంది. ఏకంగా పుట్టపర్తి లోని సాయిబాబా టెంపుల్ లో ప్రవచనాలకు వెళ్ళింది సాయి పల్లవి. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. పద్ధతిగా పట్టుచీరలో సాంప్రదాయానికి తగ్గట్లుగా ఒక తెలుగు అమ్మాయి తరహాలోనే ఈ ఫోటోలో కనిపిస్తుంది సాయి పల్లవి. ఇక ఇలా అందరూ హీరోయిన్ల కంటే భిన్నంగా సాయి పల్లవి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడంతో అభిమానులు ఫిదా అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: