బాలకృష్ణతో ఆ డిజిటల్ ప్లాట్ ఫామ్ షోను ప్లాన్ చేస్తుందా..?

Pulgam Srinivas
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల కాక ముందే బాలకృష్ణ మరో టాలెంటెడ్ డైరెక్టర్ అయినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రారంభం అయింది. ఇలా వరుస కమిట్మెంట్ లతో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ టాక్ షో కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

దానితో ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ బాలకృష్ణ తో ఒక అదిరిపోయే టాక్ షో ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం బాలకృష్ణ తో ఈ డిజిటల్ సంస్థ వారు సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు ... అన్ని కుదిరితే నెట్ ఫ్లిక్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో బాలకృష్ణ ఓ షో చేయబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ తాజాగా నటించిన వీర సింహా రెడ్డి మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: