చిరంజీవి మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ .. ఏకంగా థియేటర్లలో..!

Divya
చిరంజీవి ఇటీవల నటించిన ఆచార్య సినిమాతో భారీ ఫ్లాప్ చూసిన తర్వాత గాడ్ ఫాదర్ సినిమాతో పరవాలేదు అనిపించుకున్నాడు. అయితే ఆయన రేంజ్ కి తగ్గ సినిమా కాదని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ బాబి డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నారు . అంతే కాదు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ ప్రకారం చిరంజీవి , రవితేజ సవతి సోదరులుగా ఇందులో నటించబోతున్నట్లు.. రవితేజ తెలంగాణకు, చిరంజీవి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తులుగా చూపించబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ , టీజర్, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులలో పూనకాలు తెప్పిస్తున్నాయి.  కేవలం చిరంజీవి అభిమానులే కాదు అటు రవితేజ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రవితేజ పాత్రకు సంబంధించి విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మాస్ మహారాజా మరొకసారి తన మాస్ చూపించాడు అంటూ కూడా కామెంట్లు వినిపించాయి. మొత్తానికైతే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోబోతోంది అని కూడా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. అయితే ఇప్పుడు మరొకసారి అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా అప్డేట్ ఇచ్చారు చిత్రం మేకర్స్.
ప్రముఖ బడా నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పుడు ఐదవ పాట కూడా విడుదల చేయబోతున్నారు. అసలు విషయం ఏమిటంటే డిసెంబర్ 31వ తేదీన ఈ సినిమా నుంచి ఐదవ పాటను విడుదల చేసే అవకాశం ఉందని.. అది కూడా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్లో ఐదు థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయం తెలిసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్ లో కూడా సెరవేగంగా దూసుకుపోతోంది ఈ సినిమా.  ఈ సినిమా చిరంజీవి మార్కును నిలబెడుతుంది అని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: