వైరల్ అవుతున్న రష్మీ ఇంస్టాగ్రామ్ స్టోరీ ...!!

murali krishna
2022 సంవత్సరం ముగియడానికి వస్తుంది.. దీంతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి చాలామంది వేచి చూస్తూ ఉన్నారు. ఒకవైపు ఈ సంవత్సరానికి ఆనందంగా వీడ్కోలు పలకడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఇప్పటికే ఎందరో సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా ఈ సంవత్సరంలో తాము చేసిన మంచి పనులు అలాగే దిగిన ఫోటోలు, నేర్చుకున్న గుణపాఠాల గురించి సోషల్ మీడియాలో పంచుకుంటూ ఈ సంవత్సరం ని పంపించడానికి సిద్ధంగా అయితే ఉన్నారు. మరి కొంతమంది పలు పార్టీలు కూడా చేసుకుంటూ ఈ సంవత్సరం ఇదే చివరి పార్టీ అంటూ తెలుపుతున్నారు. తాజాగా యాంకర్ కమ్ యాక్టర్ రష్మీ గౌతమ్ కూడా తన ఈ సంవత్సరంకు గ్రాండ్ వీడ్కోలు పలుకుతుంది.

బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మీ గౌతమ్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. జబర్దస్త్ లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తన మాట తీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంది. మొదట్లో రష్మీ వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టగా ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా స్థిర పడింది.. దీంతో రష్మీకి జబర్దస్త్ ద్వారా మంచి ఫాలోయింగ్ అయితే ఏర్పడింది. అంతేకాకుండా వెండితెరపై అవకాశాలు కూడా అందుకొని పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది.
కానీ ఆమెకు మాత్రం బుల్లితెర లోనే ఎక్కువ క్రేజ్ వచ్చింది అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం స్టార్ యాంకర్లలో ఈమె కూడా ఒకరని చెప్పవచ్చు.. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా యాంకర్ గా బాధ్యతలను చేపట్టింది. గతంలో ఢీ షోలో కూడా టీం లీడర్ గా చేసి బాగా ఎంతో సందడి చేసింది. ఈ సమయంలోనే ఆమెకు సోషల్ మీడియా స్టార్ అయిన దీపిక పిల్లి తో మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కూడా కలిసే వెళ్తూ తెగ రచ్చ చేస్తున్నారు.రష్మీ మరో బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ తో గతంలో ఎంతలా రచ్చ చేసిందో మనం చూసాం. వీరిద్దరి మధ్య చనువు చూసి చాలామంది కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని భ్రమ పడ్డారు.కానీ వాళ్ళు కేవలం షోస్ వరకు మాత్రమే అలా ప్రవర్తించేవారు అని అయితే తెలిసింది. ఇక రష్మీకి జంతువులంటే చాలా ఇష్టం. వాటికి ఏమైనా జరిగితే ఆమె అస్సలు తట్టుకోలేదు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా తనకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తుంది.. అంతేకాకుండా సమాజంలో జరిగే విషయాలపై కూడా యాక్టీవ్ గా ఉంటుంది.. ముఖ్యంగా మూగజీవుల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఇక ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫ్రెండ్స్ తో కలిసి తెగ సందడి చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టా వేదికగా ఒక స్టోరీని ఆమె పంచుకుంది. ఇందులో తనతో పాటు దీపిక పిల్లి కూడా ఉన్నట్లు తెలిపింది. అంతే కాకుండా మరో అమ్మాయి కూడా ఉన్నట్లు కూడా తెలిసింది. ఇక ఈ ముగ్గురు కలిసి మందు తో చిల్ అవుతున్నట్లు కూడా కనిపించారు. పైగా 2022 లో ఇదే లాస్ట్ అన్నట్లుగా కాప్షన్ కూడా వారు ఇచ్చారు. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: